తెలుగు సినిమా ఖ్యాతిని మరో లెవెల్ కు తీసుకు వెళ్లడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను రూపొందించాడు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ భారీ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేశారట. టీజర్, ట్రైలర్ చూస్తేనే సినిమా కచ్చితంగా ఆడియన్స్ను సరికొత్త ప్రపంచానికి తీసుకువెళుతుందని క్లారిటీ వస్తుంది. అందుకే జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్ కీలక పాత్రలో నటించారు. వారిలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, దీపిక, దిశా పటాని, తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో సినిమాలో నటించిన స్టార్ సెలబ్రిటీల రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కేవలం స్టార్ సెలబ్రిటీల రెమ్యూనరేషన్ కి రూ.250 కోట్లు ఖర్చు చేశారట మేకర్స్. దీంతో ఎవరెవరు ఎంత చార్జ్ చేశారో తెలుసుకోవాలన్న ఆశక్తి అందరిలోను మొదలైంది.
ఒకసారి ఆ వివరాలు చూద్దాం. ఈ సినిమా కోసం ప్రభాస్ రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఈయన తర్వాత అమితాబ్ రూ.20 కోట్లు, కమలహాసన్ రూ. 20 కోట్లు, దీపికా పదుకొనేకు రూ.12 కోట్లు, దిశా పటాని రూ.3 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేశారని.. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కలిపి రూ.50 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తుంది. ఇలా మొత్తంగా క్యాస్టింగ్ కే రూ.250 కోట్ల వరకు రెమ్యనరేషన్ పోగా మిగిలిన రూ.450 కోట్లతో సినిమాను భారీ విజువల్స్ తో రూపొందించారంటూ న్యూస్ నెటింట వైరల్గా మారింది.