టాలీవుడ్ బ్యూటీ నివేత పేతురాజ్ ప్రస్తుతం పరువు వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ అగస్త్య నివేతకు జంటగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సిద్ధార్థ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా ఈ సినిమాను దర్శకత్వం వహించారు. మెగ బ్రదర్ నాగబాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఒకప్పటి హీరోయిన్ బిందు మాధవి విలన్ రోల్లో ఆకట్టుకుంది. రీసెంట్ గా ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా నివేత కార్ డికీలో శవం ఉన్నట్లు కవరింగ్ ఇస్తూ పోలీసులతో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే.
తర్వాత ఇది ఓ ప్రాంక్ వీడియో అని తెలియడంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి హైప్ వచ్చంది. అయితే సినిమా ప్రమోషన్ కోసమే ఈ ప్రాంక్ చేసిన దీన్ని బట్టి సిరీస్ కాన్సెప్టె ఏంటో అర్థమయ్యేలా చెప్పారు మేకర్స్. ప్రమోషన్ తో సినిమాపై హైప్ పెంచినా.. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంట్లో నుంచి పారిపోయి పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలని హీరో, హీరోయిన్ అనుకుంటారు. వీళ్ళ ప్రయాణంలో చాలా ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి.
ఈ జంటను చంపడానికి కొందరికి కిల్లర్స్ రావడం.. వళలో ఒకడిని ఈ అవర్స్ ఇద్దరూ చంపేసి హంతకులుగా మారడం చూపించారు. ఇందులో నుంచి వారు ఎలా బయటపడతారు అనేది ఈ పరువు కథాంశం. ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంటుంది. ఇక జూన్ 14 నుంచి జీ ఫైవ్ ఓటీటీ మీడియాలో పరువు స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతం ఈ ట్రైలర్ నెటింట వైరల్ కావడంతో.. ఈ సినిమా హిట్ కొట్టేలానే ఉందే అంటూ తమ అభిప్రాయాని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.