బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యింది. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలోను చరణ్ సరసన నటించింది. ఇప్పుడు మరోసారి గేమ్ చేంజర్ సినిమా కోసం జోడి కట్టింది ఈ అమ్మడు. అటు బాలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్ లోనూ బిజీ బిజీగా గడుపుతున్న కియారా.. పలు యాడ్ షూట్స్ లోను నటిస్తూ ఆకట్టుకుంటుంది. సేల్స్ పెంచుకోవడానికి ఎన్నో బ్రాండ్లు ఆమెతో టై అప్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే కియారా ఎన్నో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. అయితే కియారా ఎటువంటి బ్రాండ్ ప్రమోట్ చేయకుండానే.. ఓ పరికరం డిమాండ్ భారీగా పెరిగిందని.. కియారా పేరుతోనే ఆ ప్రోడక్ట్ సెర్చింగ్ కూడా భారీగా జరిగినట్లు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ యాజమాన్యంలోని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాత సోమన్ మిశ్ర ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. లస్ట్ స్టోరీస్ సినిమా 15 జూన్ 2018 లో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.
వైవిధ్య కథలను కలిపి ఈ సినిమా వచ్చింది. లైంగిక నేపథ్యంలో ఎన్నో సన్నివేశాలు ఉంటాయి. ఈ మూవీలో వికీ కౌశల్, కియారా అద్వానీ కలిసి కనిపించారు. సినిమాలో కియారా తన భర్తతో లైంగికంగా సంతృప్తి చెందని ఓ మహిళగా ప్రేక్షకులకు పరిచయమైంది. కారణంగా హీరోయిన్ సెక్స్ టాయిని ఉపయోగిస్తూ సాటిస్ఫై అవుతూ ఉంటుంది. అప్పట్లో ఈ సీన్ తెగ వైరల్ గా మారింది. ఇక ఈ సీను వల్ల సినిమాకు కూడా మంచి స్పందన వచ్చింది. అయితే కియారకు ఈ సినిమా భారీ పాపులారిటీ తెచ్చిపెట్టింది.
ఈ ఎఫెక్ట్ గురించి సామాన్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సెక్స్ టాయ్ అమ్మకాలు బీభత్సంగా పెరిగాయని.. ఆ సీన్ వైరల్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీంతో సెక్స్ టాయ్స్ విక్రయాలు అధికమయ్యాయి. గూగుల్ లో కియారా అద్వానీ వైబ్రేటర్, కియారా అద్వానీ సెక్స్ టాయ్ అంటూ సెర్చింగ్ చేశారని సోమన్ వివరించాడు. కొందరు ఈ మివీ పై ఆమెను ట్రోల్స్ చేసినప్పటికీ.. దీంతో ఈమెకు కబీర్ సింగ్, గుడ్ న్యూస్, షేర్వా లాంటి హిట్ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చరణ్ గేమ్ చేంజర్ తో పాటు.. తారక్ వార్ 2 సినిమాలో కూడా నటిస్తోంది. ఇక గతేడాది కియారా, సిద్ధార్థ్ మల్హోత్రమల్హోత్ర ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.