ప్రముఖ నటి, మోడల్ పూనామ్ పాండే క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లుగా నిన్నటి నుంచి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరికీ బిగ్ షాక్ ఇస్తూ పూనామ్ స్వయంగా వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ నేను గర్భాసయ్య క్యాన్సర్ తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.. నేను బ్రతికే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది.
గర్భసయ కాన్సర్ తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.. కానీ ఈ వ్యాధి ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర కాన్సర్లు మాదిరిగా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే గర్భసయ కాన్సర్ పూర్తిగా నివారించుకోవచ్చు. హెచ్పీవీ వ్యాక్సిన్ ముందస్తుగా తీసుకుంటే దీన్ని ఎదుర్కోవడం సులభం అవుతుంది అంటూ వివరించింది. ఈ వ్యాధితో ఎవరు తమ ప్రాణాలు కోల్పోకుండా ముందస్తు మార్గాలు వైద్యశాస్త్రంలో ప్రవేశపెట్టారు.
గర్భసయ కాన్సర్ విషయంలో ప్రతి మహిళ తీసుకోవాల్సిన చర్యలు గురించి అందరికీ తెలిసేలా చేయండి అంటూ ఈ వీడియోలో వివరించింది. తన మరణ వార్త విషయంలో అందరూ నన్ను క్షమించాలి.. అని కోరిన పూనమ్ పాండే మహిళల్లో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ గర్భాసయ్ క్యాన్సర్ గురించి అందరికీ తెలిసేలా చేయడమే ప్రధాన ఉద్దేశం అంటూ వివరించింది. ఇక ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సిల్ డే కావడంతో దీనిపై అవగాహన కల్పించేందుకు పూనామ్ ఇలాంటి సంఘటనకు పాల్పడిందని తెలుస్తుంది.
View this post on Instagram