టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన మూవీ నా సామి రంగ. ఇందులో యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది.
ఈ సినిమాతో యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథన్ కు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా మంచి ఛాయిస్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. నా సమీరంగ మూవీ స్క్రీనింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో ఈ సినిమా ఈ ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగార్జున ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీకి ఆస్కార్ ఆవార్డ్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.