బాలయ్యతో చచ్చిన న‌టించ‌న‌ని…మొహం మీదే చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరంటే…!

నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ నటుడుగా ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి బాలయ్య సరసన హీరోయిన్‌గా అవకాశం వస్తే కుర్ర హీరోయిన్లు కూడా నటించడానికి ఒకే చెబుతున్నారు.

అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించడని మొహం మీదే నో చెప్పిందట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. బాల‌య్య- వినాయ‌క్ కాంబోలో వ‌చ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాల‌య్య‌కు జంట‌గా ట‌బు, శ్రియా న‌టించారు. ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేశాడు. అయితే ఈ సినిమాలో బాల‌య్య‌కు జంట‌గా ముందుగా టబు ప్లేస్ లో స్టార్‌ హీరోయిన్ రమ్యకృష్ణని అనుకున్నారట.

Chennakesava Reddy 2002 | #Telugu Full Movie | Nandamuri Balakrishna | Shriya | Tabu - video Dailymotion

ఇదే విష‌య‌న్ని రమ్యకృష్ణకు చెప్ప‌డంతో ఆమె నో చెప్పిందట. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ సినిమాలో ద్విపాత్రభినయం చేసినప్పుడు బాలయ్య తండ్రి పాత్రకు రమ్యకృష్ణని హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ రమ్యకృష్ణ ఆ పాత్రకు నో చెప్పిందట. ఎందుకంటే ఆమె ఆ సమయానికి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Telugu Balakrishna, Ramya Krishna, Tabu, Ramyakrishna, Shriya-Movie

ఆ సమయంలో బాలకృష్ణకు త‌ల్లి పాత్ర‌లో రమ్యకృష్ణ నటించాల్సి వస్తే తన సినీ కెరీర్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఆ పాత్రకి హీరోయిన్ టబుని తీసుకున్నారు. అలాగే కొడుకు పాత్ర పక్కన హీరోయిన్ గా శ్రియని తీసుకున్నారు. ఇక సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.