ఈ సంవత్సరం సినిమాల సంగతి ఇలా ఉంచితే వచ్చే కోత్త సంవత్సరం మీద టాలీవుడ్లో ఇప్పటి నుంచే భారి అంచలు పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటీకే సంక్రాంతి సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు వచ్చే సమ్మర్లో కూడా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న హీరోల సినిమాలు రానున్నాయి. అ తర్వాత వచ్చే దసరాకు మాత్రం స్టార్ హీరోలైన బాలయ్య, పవన్ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నరు.
అయితే ఇప్పుడు అందరి చూపు మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, బన్నీ, చరణ్ సినిమాల మీదే ఉంది. అ హీరోల సినిమాలు ఈ ఏడాది లేనట్లే. వారిలో మహేష్, ప్రభాస్ సినిమాలు మాత్రమే వుండే అవకాశం వుంది. దిన్నివల్ల అందరి దృష్టి వచ్చే సంవత్సరం మీద పడింది. అక్కడ కాస్త గట్టి పోటీ కనిపిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ఆ సినిమాల డేట్ లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
మహనటి సినిమా తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ పాన్ ఇండియా హీరో ప్రభాస్తో ప్రాజెక్ట్ K సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రీలిజ్ డేట్ను నిన్న మహా శివరాత్రి కానుగా ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నామని ప్రకటించారు. 2024 సమ్మర్లో రామ్ చరణ్-శంకర్ సినిమా ఉంటుందంటున్నారు.
ఈ రెండింటి మధ్యలో బన్నీ – సుకుమార్ పుష్ప 2 సినిమా వచ్చే అవకాశం వుంది. మరి ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా కూడా 2024 ఏప్రిల్ 5న వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా వుంటే ఈ సంవత్సరం ఆగస్ట్ 11 డేట్ కు కూడా మంచి పోటీ కనిపిస్తోంది. ఈ డేట్ కు మహేష్-త్రివిక్రమ్ సినిమా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.
అయితే అదే రోజున మెగాస్టార్ భోళాశంకర్ కూడా వస్తుందని తెలుస్తుంది. మరి మహేష్ సినిమాను ఎక్కడికి జరుపుతారో చూడాలి. ఇలా మొత్తం మీద ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా డేట్ ల సర్దుబాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి.