టాలీవుడ్ హీరోలు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఒకరి సినిమాకి.. ఒకరు సపోర్ట్ చేసుకుంటూ.. ఒకరికి ఒకరు మద్దతు తెలుపుకుంటున్నారు. తాము నటించిన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు. తమ తోటి హీరోలతో కలిసి షోస్ చేస్తున్నారు కుదిరితే వారితో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే అభిమానుల్లో మాత్రం మార్పు రావట్లేదు. హీరోలందరూ కలిసి ఉన్న ఫ్యాన్స్ మాత్రం నువ్వా.. నేనా అనే గొడవలకు దిగుతూనే ఉన్నారు.
మా హీరో గ్రేట్ అంటే.. మా హీరో తోపు అనుకుంటూ.. చొక్కాలు చిరిగిపోయేలా గొడవలకు దిగుతున్నారు. ఇక దీనికి ప్రత్యక్ష సాక్షంగా మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది అనుకుంటే పొరబాటే.. ఖండంతరాలు దాటి అమెరికాలో కూడా అభిమానుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో బాలయ్య- చిరంజీవి అభిమానుల మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది.
ఈ ఇద్దరు హీరోల అభిమానులు చొక్కాలు చిరిగిపోయే విధంగా ఆ రోడ్ల మీద కొట్టుకున్నారు. ఇక అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ముందుగా జై బాలయ్య, జై చిరంజీవ అంటూ మొదలైన స్లోగన్లతో ఈ గొడవ స్టార్ట్ అయింది. ఒకరిపై ఒకరు బండ బూతులు తిట్టుకున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే మరో మెట్టు పైకి వెళ్లి ఈసారి సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డిదే విజయం వాల్తేరు వేరయ్య ప్లాఫ్ అవుతుంది అంటూ చిరంజీవి అభిమానుల మీద కామెంట్లు చేశారటా.
ఈక్రమంలో బాలయ్య అభిమాని ఎన్నారై కేసీ చేకూరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అక్కడి నుంచి డల్లస్ స్టేషన్ కు చేకూరిని తరలించారు. ఇక ఈ ఘర్షణతో పలువురికి గాయలు అవ్వగా వారు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈక్రమంలో చేకూరికి బెయిల్ కోసం తానా నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడ గొడవ అంతా ఆన్ స్టపబుల్ షోకు పవన్ కళ్యాణ్ రావడంతోనే అంటూ తెలుస్తుంది. ఈ విషయంలోనే మాట మాట పెరిగి బాలయ్య- చిరంజీవి అభిమానుల మధ్య గొడవకు దారి తీసినట్లు సమాచారం.