నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున వీరసింహా రెడ్డి సినిమాలో షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నా బాలకృష్ణ ఈ సినిమా తో పాటు అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఓ టాక్ షో కు హోస్ట్ గా చేయడం…. తన వాక్ చాతుర్యంతో , తన డైలాగ్ డెలివరీతో అన్ స్టాపబుల్ను హిట్ చేయడం ఆయనకే చెల్లింది.
ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 రీసెట్ంగా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సీజన్ 2 కి కూడా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ టాక్ షో కు రెబల్ స్టార్ ప్రభాస్ మరియు మ్యాచో హీరో గోపీచంద్ ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఆ ఎపిసోడ్ కూడా న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ టాక్ షోపై ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కూడా ఒక ఎపిసోడ్ కు గెస్ట్ లుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కనుక ఈ ఎపిసోడ్ కు వచ్చినట్లు అయితే అది నందమూరి అభిమనులకు పండుగా లాగా ఉంటుంది. ఒకే వెదికపై ముగ్గురు నందమూరి హీరోలు కనబడినట్టు ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో అత్రుతగా ఎదురు చుస్తుంది.