`కాంతార‌`పై పూజా హెగ్డే రివ్యూ.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అట‌!

పూజా హెగ్డే.. ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఒక్క సినిమాతో బుట్ట బొమ్మ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఆ తరువాత మంచి అవకాశాలతో వరస హిట్ సినిమాలలో కనిపిస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోయింది. ఇక ఇటీవల కాలంలో పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో పూజ వరస పరాజయాలను చవి చూసింది. ఇక అప్పటినుండి పూజా నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

ఇక అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా `కాంతార` సినిమా పేరు వినిపిస్తుంది. ఎలాంటి హంగులు లేకుండా విడుదలైన `కాంతార` కన్నడ ఇండస్ట్రీలో భారీ సంచలనాన్ని సృష్టిస్తూ.. ఇప్పటివరకు అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా కర్ణాటక, కేరళలో విస్తరించి ఉన్న తుళునాడు ఆచారాలను ఆధారంగా చేసుకుని రూపొందించినట్టు తెలుస్తుంది.

తాజాగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే `కాంతార` సినిమా పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని.. ఓ ప్రాంతీయ సంస్కృతిని అందరికీ చేరువయ్యేలా తీర్చిదిద్దారని ఆమె ఇన్ స్టా వేదికగా ఈ సినిమాపై ఆమె అభిప్రాయాన్ని తెలిపారు. `మీకేం తెలుసో దాన్నే కథ రాయండి`.. మీ హృదయానికి చేరువైన అలాగే మీ మనసులో నుంచి వచ్చిన కథల్ని చెప్పండి అంటూ ఎన్నో ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

ముఖ్యంగా కాంతార సినిమా క్లైమాక్స్ 20 నిమిషాలు తన రోమాలు నిక్కబడుచుకున్నాయంటూ.. విజువల్స్, నటీనటుల ప్రదర్శనకు చలించిపోయాను అంటూ పూజా చెప్పుకొచ్చింది. డైరెక్టర్ రిషాబ్ శెట్టి కాంతార విశేషమైన ఆదరణ పొందుతున్నందుకు తనకు గర్వంగా ఉందంటూ.. తన చిన్నతనంలో చూసిన భూత కోలాన్ని ఎంతో అద్భుతంగా చూపించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నావ్ అంటూ ఆమె రాసుకొచ్చింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో తాను మరెన్నో ప్రశంసలు అందుకోవాలంటూ ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే 16 కోట్ల బడ్జెట్ తో తెరికెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 188 కోట్లు పైగా వసూలు చేసి 200 కోట్లకు చెరువులో ఉందని సమాచారం.