విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పెళ్లయిపోయింది.. జాన్వీ ఓపెన్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా `అర్జున్ రెడ్డి` సినిమా తో దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవల విడుదలైన `లైగ‌ర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి స్టార్ డమ్ ని దక్కించుకున్నాడు. ఇక అతడు పెళ్లికి ఊ అనాలే కాని ఎంతోమంది అందగత్తెలు రెడీగా ఉన్నారు.

అయితే విజయ్ దేవరకొండపై క్రష్ ఉందంటూ యంగ్ బాలీవుడ్ హీరోయిన్లు అయినా జాన్వీ కపూర్ మరియు సారా అలీ ఖాన్, కియరా అద్వాణీ ఎప్పుడో బయటపడ్డారు. అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నతో రిలేషన్షిప్ లో ఉన్నాడని ఇప్పటికే చాలా వార్తలు రాగా వీటిపై జాన్వీ, సారా కూడా పలుమార్లు హింట్లు కూడా ఇచ్చారు. అయితే తాజాగా జాన్వి కపూర్ తన లేటెస్ట్ సినిమా `మిలీ` ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ బబుల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఇంటర్వ్యూలో భాగంగా జాన్వి కపూర్ తాను స్వయంవరం చేసుకోవాల్సి వస్తే సినీ ఇండస్ట్రీ నుంచి ఏ ముగ్గురు హీరోలను ఎంచుకుంటావ్ అనే ప్రశ్న ఎదుర్కోగా.. దీనిపై స్పందిస్తూ జాన్వీ..హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, టైగర్లను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పడం విశేషం. అయితే రణబీర్ కపూర్ మరియు హృతిక్ రోషన్ కి పెళ్లయిపోయిన విషయం గుర్తుకు వచ్చి ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరున్నారని ఆలోచించగా అదే సమయంలో విజయ్ దేవరకొండ పేరుని హోస్ట్ సూచించారు.

ఇక ఆ విషయంపై జాన్వీ షాకింగ్ కామెంట్స్ చేసింది.అయితే దాదాపు విజయ్ దేవరకొండకు పెళ్లయిపోయింది అని ఆమె చెప్పడం జరిగింది. అయితే దీని అర్థం విజయ్-రష్మిక డేటింగ్ లో ఉన్నారని జాన్వి కన్ఫామ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల విజయ్ రష్మిక ఇద్దరూ ఒకే సమయంలో మాల్దీవుల వెకేషన్ కి వెళ్లడం పలు సందేహాలకు దారితీస్తుంది. కానీ వీరిద్దరూ డేటింగ్ వ్యవహారాన్ని అంగీకరించక‌పోయినప్పటికీ కూడా వీరిపై వార్తలు వస్తూనే ఉంటున్నాయి. ఈ విషయాన్ని జాన్వి నమ్ముతూ ఆ ఉద్దేశంతోనే విజయ్ కి పెళ్లయిపోయిందని ఓపెన్ గా చెప్పిందని అభిమానులు వారి సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వి చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.