మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` పూర్తి చేసే పనిలో ఉన్న చిరు.. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మరియు మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.
అయితే ఇప్పుడు చిరు ప్రముఖ డైరెక్టర్ క్రిష్కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. క్రిష్ తాజాగా తెరకెక్కించిన చిత్రం `కొండపొలం`. ఈ మూవీలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ హీరోయిన్గా నటించింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవలను ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
అయితే తాజాగా ఈ చిత్రం చూసిన చిరంజీవి.. కొండపొలంపై ప్రశంసలు కురిపించారు. క్రిష్ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని, వైష్ణవ్ తేజ్ పెర్ఫామెన్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయని చిరు చెప్పుకొచ్చారు. మంచి మెసేజ్తో కూడిన లవ్స్టోరి అని చిరు రివ్యూ ఇచ్చారు. అంతేకాదు, కొండపొలం సినిమాకు ఫిదా అయిన చిరు.. తన కోసం ఓ మంచి కథ సిద్ధం చేయమని క్రిష్కి చెప్పినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. మరి ఇదే నిజమైతే త్వరలో వీళ్ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది.