కింగ్ నాగార్జునతో కలిసి ఆయన తనయుడు, స్టార్ హీరో నాగ చైతన్య మైసూర్కి చెక్కేశాడు. వీరిద్దరు ఇంత సడెన్గా మైసూర్కి వెళ్లడానికి కారణం ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా నటిస్తోంది. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లగా.. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తి అయింది.
అయితే సెకెండ్ షెడ్యూల్ను దర్శకుడు మైసూర్లో ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలోనే నాగ్తో పాటు చైతు కూడా మైసూర్కి వెళ్లి షూటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.