నాగ్‌తో మైసూర్‌కి చెక్కేసిన చైతు..కార‌ణం అదేన‌ట‌!

కింగ్ నాగార్జున‌తో క‌లిసి ఆయ‌న త‌న‌యుడు, స్టార్ హీరో నాగ చైత‌న్య మైసూర్‌కి చెక్కేశాడు. వీరిద్ద‌రు ఇంత స‌డెన్‌గా మైసూర్‌కి వెళ్ల‌డానికి కార‌ణం ఏంటో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్‌గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

Nagarjuna Bangarraju script changed - tollywood

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా న‌టిస్తోంది. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌గా.. ఫ‌స్ట్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో పూర్తి అయింది.

Nagarjuna Bangarraju Movie opening Pics - Photogallery - Page 2

అయితే సెకెండ్ షెడ్యూల్‌ను ద‌ర్శ‌కుడు మైసూర్‌లో ప్లాన్ చేశాడు. ఈ నేప‌థ్యంలోనే నాగ్‌తో పాటు చైతు కూడా మైసూర్‌కి వెళ్లి షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ వీరిద్ద‌రిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. కాగా, భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నాగార్జున నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.