అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి అడ్డుపడింది. ఓటీటీలోనే చిత్రం విడుదల అవుతుందని జోరుగా ప్రచారం జరగగా.. మేకర్స్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్తో ఆ ప్రచారానికి పులిస్టాప్ పడింది.
అవును, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికరికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. కాగా, కెరీర్ స్టార్టింగ్ నుంచీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అఖిల్.. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. మరోవైపు డైరెక్టర్ భాస్కర్ కూడా ఈ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలను కోరుకుంటున్నారు.