ప్రముఖ బాలీవుడ్ నటి, క్వీన్ అయిన కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేసిందా మైక్రో బ్లాగింగ్ సంస్థ. ఆదివారం నాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సమయంలో నటి కంగన కొన్ని అసభ్యకరమయిన ట్వీట్లు చేయడం వల్లే కంగనా అకౌంట్ను సస్పెండ్ చేశారు సంస్థ. ఇది ట్విటర్ మార్గదర్శకాలను ఉల్లంఘించడం వల్లే అని ఆ సంస్థ తెలిపింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై కంగనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. మమతని కంగనా రాక్షసిగా ట్విట్టర్లో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన కొనసాగాలంటూ ఆమె డిమాండ్ చేసింది. అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా కూడా అక్కడ హింస ఉందని, పశ్చిమ బెంగాల్లో మాత్రం టీఎంసీ హింసకు పాల్పడుతుందని కంగనా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. బెంగాల్ ఇలా మంటల్లో కాలిపోతుందంటూ కంగనా ట్వీట్ చేయడం పై ట్విటర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేసింది.