వరుస కష్టాలతో విలవిల్లాడుతోన్న ఏపీ విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. కీలకమైన విశాఖ నగరానికి ఆనుకునే ఉన్న భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం పార్టీకి గుడ్ బై చెప్పపేశారు. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన సీతారాం జగన్ తీరుతో విసిగిపోయి తాను పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. పార్టీ వీడుతున్న సందర్భంగా మీడియా సమావేశం పెట్టిన ఆయన […]
Tag: ysrcp
గుంటూరు వైసీపీ అభ్యర్థుల్లో ఇన్ – అవుట్ లిస్టు
2019 ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమని డిసైడ్ అయిన జగన్ ఆ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే రకరకాల ప్రణాళికలతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 17 ఎమ్మెల్యే స్థానాలకు గాను ఐదుగురు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత చాలా మంది సిట్టింగ్ ఇన్చార్జులకు షాకులు ఇచ్చి […]
అక్కడ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో టీడీపీ
సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ సీటు అధికార టీడీపీది కావడంతో ఇక్కడ ఈ సీటును తిరిగి నిలుపుకునేందుకు టీడీపీ, ఇక్కడ నుంచి గెలిచిన భూమా వైసీపీ తరపున గెలవడంతో ఇక్కడ తిరిగి సత్తా చాటేందుకు వైసీపీ రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి ఇక్కడ అభ్యర్థిగా పలువురు పేర్లు వినపడుతున్నా ఇప్పటి వరకు ఎవ్వరి పేరు ఫైనలైజ్ కాలేదు. […]
కోటగిరికి జగన్ షాక్… ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే సీటుకు
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం నిన్నటి వరకు సీనియర్ రాజకీయ నాయకుల వారసులను వరుసగా తన పార్టీలో చేర్చుకున్న జగన్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వారికి ఒక్కొక్కరిగా షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. జగన్ కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దివంగత సీనియర్ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీథర్కు ఏలూరు లోక్సభ నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. శ్రీథర్ సైతం వచ్చే ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎంపీ టిక్కెట్టు తనదే అన్న […]
జగన్ కంచుకోటను కూల్చుతోన్న ఆ ఇద్దరు ఎవరు..!
వైఎస్.ఫ్యామిలీ పేరు చెపితే కడప జిల్లాలో….అందులోను పులివెందులలో ఆ ఫ్యామిలీ క్రేజ్, పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్.ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందుల కోటకు ఇప్పుడిప్పుడే బీటలు వారుతోంది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉండి కూడా జగన్ చిన్నాన్న వైఎస్.వివేకానందరెడ్డి ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలకు, వైఎస్ అభిమానులకు అస్సలు మింగుడు పడలేదు. వైఎస్ […]
మాటలతో కానిది భేటీతో సాధ్యమైందా?
మాటల వల్ల చెప్పలేనిది మీటింగుల వల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు అలాంటి ఒకే ఒక్క మీటింగ్ ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. వైసీపీ నేతల్లో జోష్ నింపుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధాని మోదీతో ప్రతిపక్ష నేత జగన్ భేటీ.. ఏపీలో రాజకీయ సమీకరణాలను మార్చబోతోంది. 2019లో జగన్ జైలుకు ఖాయమని, ఇక అధికారం శాశ్వతమని భావిస్తున్న నేతలకు ఒక్కసారిగా గొంతులో వెలగపండు పడినంత పనయింది. ఇదే సందర్భంలో పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకునే […]
మంత్రి పదవి పాయే…. ఎమ్మెల్యే టిక్కెట్టు కష్టమే..!
ఎన్నో ఆశలతో, మంత్రి హామీతో వైసీపీ నుంచి సైకిలెక్కిన ఎమ్మెల్యే పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారిపోయిందట. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరు పరిగనణలోకి కూడా తీసుకోకపోవడంతో ఇప్పటికే ఆయన అసంతృప్తిలో ఉన్నారట. పార్టీలో చేరే సమయంలో సీఎం చంద్రబాబు.. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా చివరి నిమిషంలో పట్టించుకోలేదట. ఇప్పుడు దీనికి తోడు.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలో […]
ఆ ఇద్దరి భేటీతో మిత్ర బంధానికి బ్రేక్ పడిందా?
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి సరైన నిర్వచనంలా మారుతున్నాయి. కొత్త పొత్తులకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ-బీజేపీ నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అనంతరం.. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం అంతర్గతంగా ఉన్న విభేదాలు.. మరోసారి బయటపడ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు పలికేలా […]
టీడీపీకి షాక్: బీజేపీకి వైసీపీ మద్దతు
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మిత్రుల మధ్య కలహాలు.. కొత్త పొత్తులు, వ్యూహాలతో రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తోందని మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు చూచాయగా ఒప్పుకున్నట్లు ఆసక్తికర కథనం చక్కెర్లు కొడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడం.. ఇప్పుడు టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. ప్రతిపక్ష వైసీపీతో బీజేపీ సత్సంబంధాలు కొనసాగిస్తోందనే […]