వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ….జ‌గ‌న్ రెండు ఆఫ‌ర్లు

రాయ‌ల‌సీమ‌లోని క‌ర్నూలు జిల్లాలో గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా టీడీపీ అష్ట‌క‌ష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ గాలిలో 2004, 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ తేలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ దూకుడుతో టీడీపీ కేవ‌లం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే గెలిచింది. ప‌త్తికొండ నుంచి సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం కేఈ.కృష్ణ‌మూర్తి, బ‌న‌గాన‌ప‌ల్లి నుంచి బీటీ.జ‌నార్థ‌న్‌రెడ్డి, ఎమ్మిగ‌నూరు నుంచి జ‌య‌నాగేశ్వ‌ర్‌రెడ్డి విజ‌యం సాధించారు. వైసీపీ 11 ఎమ్మెల్యేల‌తో పాటు క‌ర్నూలు, […]

ఏపీలో ఎమ్మెల్యే సీట్ల పెంపుపై వైసీపీ యాంటీ ప్ర‌చారం

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌నే పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా స‌భ‌ల‌ను బ‌లోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్ర‌బాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఏపీలో ఏకైక బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న […]

వైసీపీ అనుకూల వ‌ర్గానికి టీడీపీ గాలం!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారిపోతోందా? వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న కొన్ని వ‌ర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండివ్వాల‌ని డిసైడ్ అయ్యాయా? అదే స‌మ‌యంలో అధికార టీడీపీ పంచ‌న చేరాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప్ర‌స్తుతం ద‌ళిత వ‌ర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఇంపార్టెంట్‌గా మారింది. దీంతో వీరిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌తి పార్టీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంది. ఇక‌, వైసీపీకి ఈ విష‌యంలో క‌లిసొచ్చిన అంశం ఏంటంటే.. కోర కుండానే నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]

బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడ‌ర్లు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు నేల‌పై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మ‌ళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాల‌న దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయ‌క‌త్వం అజ‌మాయిషీనే చెల్లుబాటు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]

క‌డ‌ప‌లో జ‌గ‌న్ గ్రాఫ్ ఎందుకు త‌గ్గుతోంది….రీజ‌న్స్ ఇవే.

క‌డ‌ప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి బ‌ల‌మైన ఖిల్లా. క‌డ‌ప జిల్లా నుంచే ప్రారంభ‌మైన వైఎస్ ఫ్యామిలీ జిల్లా రాజ‌కీయాల‌తో పాటు స‌మైక్యాంధ్ర రాజ‌కీయాలు, చివ‌రిగా ఢిల్లీ రాజ‌కీయాల‌ను సైతం (అప్ప‌ట్లో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఢిల్లీలోను హ‌వా సాధించారు) శాసించింది. 2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆ త‌ర్వాత వైసీపీ పూర్తి ఆధిప‌త్యం సాధించాయి. ఈ మూడు ఎన్నిక‌ల్లోను జిల్లాలోని క‌డ‌ప‌, రాజంపేట రెండు ఎంపీ స్థానాలు ఒక్క‌సారి […]

బాబు ప్లాన్ బాబుకే దెబ్బేసింది

ఏపీ సీఎం చంద్ర‌బాబు పార్టీ ప‌టిష్ట‌త కోసం వేసిన ఓ ప్లాన్ రివ‌ర్స్ గేర్‌లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. త‌న ప్లాన్ త‌న‌కే రివ‌ర్స్‌లో తిరిగి రావ‌డంతో చంద్ర‌బాబు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాడు. ఏపీలో గ‌త యేడాది కాలంగా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ నుంచి త‌న పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్‌తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు […]

పురందేశ్వ‌రి వ్యాఖ్య‌లతో టీడీపీలో కలకలం

సొంత వ‌దినా, మ‌రిది అయినా మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నేత ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబాల మ‌ధ్య ఉప్పు నిప్పు వాతావ‌ర‌ణం ఉంది. ఈ రెండు కుటుంబాల వారు ఇటీవ‌ల స‌రిగా మాట‌లే లేవ‌న్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయంగా చంద్ర‌బాబుతో విబేధించి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ద‌గ్గుపాటి దంప‌తులు ప‌దేళ్ల పాటు అక్క‌డ మంచి పొజిష‌న్‌లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసి […]

ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కూడా బాబు ప‌రువు తీసేస్తున్న వైసీపీ!

తాను ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిగ‌ర్‌న‌ని, బిల్‌గేట్స్‌కి ఇండియా దారి చూపించింది తానేన‌ని, మైక్రోసాఫ్ట్‌కి హైద‌రాబాద్ ఎక్క‌డుందో చెప్పింది తానేన‌ని ప‌దేప‌దే చెప్పుకొచ్చే ఏపీ సీఎం చంద్ర‌బాబుకి.. జ‌గ‌న్ పార్టీ వైసీపీ మైండ్ తిరిగిపోయే షాక్ ఇస్తోంది! ఇటు రాష్ట్రం, దేశంలో బాబు ప‌రువును ప‌దేప‌దే బ‌జారున ప‌డేస్తున్న వైసీపీ ఇప్పుడు తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కూడా బాబును ఏకేస్తోంది. దీనికి రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను వాడుకుంటోంది. సోష‌ల్ మీడియాలో సీఎం త‌నయుడు లోకేష్‌కి, శాస‌న మండ‌లికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు […]

ప‌శ్చిమ‌గోదావ‌రి వైసీపీలో జ‌గ‌న్ బాంబు

2014 ఎన్నిక‌లకు 2019 ఎన్నిక‌ల‌కు ఏపీ వైసీపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా మార‌తాయో ఊహ‌కే అంద‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వైసీపీ జిల్లాలో ఖాతా తెర‌వ‌లేదు. 15 ఎమ్మెల్యే స్థానాల‌తో పాటు 3 ఎంపీ సీట్ల‌లోను ఓడిపోయింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీపై పైచెయ్యి సాధించేందుకు జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వాళ్ల‌లో చాలామందిని ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ఈ జిల్లా వ‌ర‌కు తీసుకునే నిర్ణ‌యాలు వైసీపీలో పెద్ద […]