టీడీపీ:తెలుగు వారి దౌర్భాగ్యాపు పార్టీ

రాజ్యసభలో కేవీపీ ప్రయివేట్ మెంబెర్ బిల్ చర్చ వాడి వేడిగా జరిగింది.అయితే సిగ్గు పడాల్సిన విషయమేంటంటే దేశం మొత్తం పార్టీలకతీతంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యక హోదా కోసం నిందిస్తుంటే అధికార టీడీపీ మాత్రం అత్యంత జుగుప్సయాకరమైన రీతిలో బీజేపీ ని వెనకేసుకు రావడం చూస్తే నిజంగా తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టి తగలబెట్టేశారు. ఎంతసేపు కాంగ్రెస్ అన్యాయంగా విభజించింది..ఇదంతా కాంగ్రెస్ వల్లనే..మొత్తం కాంగ్రెస్ చేసింది అని పాడిన పాటే పాడి..బీజేపీ హామీ ఇచ్చింది..కచ్చితంగా అమలు […]

టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఆశలపై కేంద్రం నీళ్ళు

పార్టీ ఫిరాయింపులకు పాల్పడేందుకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వాడుకున్న అస్త్రం ‘అసెంబ్లీ సీట్ల పెంపు’. ఆకాశంలో మేడలు కట్టేయడంలో ఈ రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. 2019 నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి, ‘ఈలోగా మా పార్టీలోకి వచ్చెయ్యండి’ అని విపక్ష నేతలకు గాలం వేశాయి టిడిపి, టిఆర్‌ఎస్‌. ఈ మూడు నాలుగేళ్ళు అధికారంలో ఉంటాం, ఆ తర్వాత సీటు గ్యారంటీ అనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిథులు తెలంగాణ, […]

కయ్యమా,వియ్యమా: బాబు దారెటు ?

ప్రత్యేక హోదా అనే పదాన్ని వినడానికి కూడా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇష్టపడటంలేదు. ఆ ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగమే. రాజ్యసభలో ఈ రోజు జరగాల్సిన ఓటింగ్‌ని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా జరగనీయలేదు. కానీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా బిల్లుకి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధమైంది. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. బిజెపి నుంచి ‘బిల్లుపై ఓటింగ్‌ జరగనీయం’ అని హామీ వచ్చిన తర్వాతే, ‘ఆ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తాం’ […]

వెండితెరపై చంద్రబాబు!

పొలిటికల్‌ స్టార్‌ వెండితెర స్టార్‌ అయ్యేలాగున్నారు. చంద్రబాబు నటిస్తారో నటించరోగానీ ఆయన మీద ఓ సినిమా రూపొందుతోంది. టిడిపి నాయకులే ఈ సినిమాని రూపొందించడానికి ముందుకు వచ్చారు. విజయవాడకు చెందిన మల్లికార్జున యాదవ్‌ కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాత. ‘చంద్రోదయం’ పేరుతో రెండేళ్ళ చంద్రబాబు పాలనలోని విజయాల్ని ప్రజలకు చేరేవేసేందుకు ఈ చిత్రాన్ని తీయనున్నారట. ఎపి టిడిపి ముఖ్య నాయకుల్లో ఒకరైన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభిస్తారు. పసుపులేటి వెంకట్‌ […]

ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ సాయం

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ రాష్ట్రం మద్దతివ్వనుందట. తెలంగాణలోని అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌, రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు (కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు)పై ఓటింగ్‌ జరిగితే, అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారమ్‌. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తితో టిఆర్‌ఎస్‌ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) కేకే సానుకూలంగా స్పందించారట. ఆంద్రప్రదేశ్‌కి అనుకూలంగా ఓటేస్తామని చెప్పారట. ఈ నెల 22వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరిగే […]

‘స్విస్‌’ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నారా?

రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు. ఆయన రాజకీయాల్లో ఉండగానే ఒకప్పటి తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా విడిపోయింది. అలా విభజన జరగడానికి ఆయన కూడా ఓ కారణం. 23 జిల్లాల తెలుగు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా రికార్డు సమయం ఏకధాటిగా పరిపాలించిన ఘనత చంద్రబాబుకి మాత్రమే దక్కింది. ఆయన ఇప్పుడు కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. పదేళ్ళు సమైక్య తెలుగు రాష్ట్రానికి ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే […]

కేవీపీకి టీడీపీ సపోర్ట్…

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఊహించని మద్దతు లభించింది. ఈ బిల్లు ఓటింగ్ వరకు వస్తే… దానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడినా… పార్టీలతో ప్రమేయం లేకుండా మద్దతు తెలపాలని కూడా […]

కోడెల అడ్డంగా దొరికిపోయాడు!

కోరి తెచ్చుకున్న కోడెల కష్టాలు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నోటి దురుసుతో కోరి మరీ కష్టాల్ని కొనితెచ్చుకున్నారు.ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కోడెల మాట్లాడారు.అందులో పోయిన ఎన్నికల్లో చేసిన వ్యయం గురించి ఆయన చెప్పిన మాటలు ఆయన మెడకే చుట్టుకున్నాయి.సదరు టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ కోడెల ఏమన్నారంటే ‘గడచిన ఎన్నికల్లో తన నియోజకవర్గం సత్తెనపల్లిలో రూ. 11.50 కోట్లు వ్యయమైంద’ని కోడెల చెప్పారు.అంతటితో ఆగకుండా అదే 1983లో జరిగిన […]

చంద్రబాబు దెబ్బకి వణుకుతున్నారు 

పార్టీలో పనిచేస్తున్న నాయకులెవరు? పనిచెయ్యని నాయకులెవరు? అని తెలుసుకోడానికి చంద్రబాబు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాల్లో ఎక్కువమంది నాయకులు పనిచేయనివారే ఉన్నారని తేలింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం, ప్రజలకు దగ్గర పోలేకపోతున్నాం చంద్రబాబు ఆ నాయకులపై అసహనం కూడా వ్యక్తం చేశారని సమాచారమ్‌. అయితే నివేదిక వివరాల్ని బయటపెట్టడంలేదని చెప్పడం కొంత ఊరట. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత పనిచేయని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ‘శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారట. ఈ శిక్షణా […]