ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగకుండా బిజెపి వ్యూహాల్ని అమలు చేస్తే, ఆ వ్యూహాలు విజయవంతమైనప్పుడు సుజనా చౌదరి బల్లలు చరుస్తూ ఆమోదం తెలపడం వివాదాస్పదమయ్యింది. మిగతా అంశాల్లో అయితే సుజనా చౌదరి తీరుని చంద్రబాబు సమర్థించేవారే. కానీ అక్కడ ప్రత్యేక హోదా అంశంపై ప్రవేశపెట్టిన బిల్లు కావడంతో వివాదం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. దాంతో చంద్రబాబు, […]
Tag: TDP
ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నాయనే […]
ఆస్తుల్లో ఏపీ మంత్రులే టాప్
ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్ 251 కోట్లతో రెండో […]
ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా
ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని […]
మోదుగల హర్ట్ అయ్యార్ట…
రాజకీయాలన్నాక నేతలు అలగడం, వారిని అధిష్టానం బుజ్జగించడం మామూలే. ఏపీ అధికార పార్టీ టీడీపీలోనూ అలిగే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలిగారు. పార్టీలో తనమాటకు విలువ లేకుండా పోయిందని, తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెగ ఫీలైపోతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సర్ది చెప్పినా మోదుగుల దిగిరాలేదని సమాచారం. మరి అంతగా ఆయన అలగడానికి […]
ఓ స్త్రీ రేపు రా!
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశం ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే ‘ఇంకా ఉంది’ అని చెబుతూ కేంద్రం తాత్సారం చేస్తుంది గనుక. ఇచ్చేది లేదని చెప్పిన తరువాత అదే మాటకు కట్టుబడి ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ‘పరిశీలిస్తున్నాం’ అనే మాట చెబుతున్నారు. ఆ పండగ, ఈ పండగ అన్నారు. అన్నీ వెళ్ళిపోయినయ్. అమరావతి శంకుస్థాపన వేదికపై నరేంద్రమోడీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగగా […]
మోడీ తెలంగాణ టూర్ – టిటిడిపి దిగులు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర బలగాలు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న ప్రాంతాలపై అవగాహన కోసం తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయి, ప్రధాని టూర్పై చర్చించాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేస్తారు. మిషన్ భగీరధ ఇందులో ముఖ్యమైనది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను మొదటి నుంచీ సమర్ధిస్తోంది నరేంద్రమోడీ ప్రభుత్వం. దాంతో తెలంగాణలో నరేంద్రమోడీ టూర్ గురించి తెలంగాణ టీడీపీ వర్గాల నుంచి ఆందోళన […]
తోడు దొంగల బ్రేకప్ ఆట!
రాష్ట్ర విభజన తరువాత మొదట్లో టీడీపీ బీజేపీ ల మధ్య రొమాన్స్ ఓ రేంజ్ లో సాగింది..ఇప్పటికీ సాగుతూనే ఉందనుకోండి అది వేరే విషయం.అయితే మొదటి నుండి ఇద్దరిమధ్య గిల్లికజ్జాలు షరా మాములే అన్నట్టుగా సాగింది సంసారం.ఇద్దరు చాలా వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు అవసరానికి తగ్గట్టు ఆచి తూచి విమర్శించుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు. ఎప్పటికప్పుడు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లకు తోచిన విదంగా ఎదుటి వాళ్ళని వాడుకుంటూ వచ్చారు.ఈ విషయం లో బీజేపీ కంటే […]
పదవి పోయినా డోన్ట్ కేర్: కేశినేని
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం తమ పదవులు పోయినా లెక్కచేయబోమని టిడిపి ఎంపీలు అంటున్నారు. బిజెపితో అమీ తుమీకి సిద్ధమని చెబుతూ అధినేత చంద్రబాబు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. అలాగే, పదవుల కోసం పాకులాడేవాళ్ళం కాదని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఎలా పోరాటం చేయాలన్నదానిపై వ్యూహరచన చేస్తున్నామని చంద్రబాబు సూచనలతో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని […]