ఏపీలో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తోన్న జనసేన అధినేత పవన్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి దూకనున్నాడు. ఈ క్రమంలోనే వివిధ జిల్లాల్లో సమస్యలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే నాలుగైదు సభలు పెట్టిన పవన్ ఇక ఇప్పుడు సీమలో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా మీద తన ఫోకస్ పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇదే జిల్లాలో ఏదో ఒక నియోజకకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఈ జిల్లా మీద రోజు రోజుకు […]
Tag: Politics
కేసీఆర్-పరిపూర్ణానంద భేటీ వెనుక వ్యూహం ఇదే..
తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యక్తిని చూపిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు అడ్డంకులు కలగకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అంత అడ్వాన్స్గా పరిణామాలను ఊహిస్తారు కనుక ప్రత్యర్థులకు అందకుండా ఎదిగిపోయారు. ఇప్పుడు ఆయన పరిపూర్ణానంద స్వామిని అకస్మాత్తుగా కలవడం అందరినీ విస్తుగొలుపుతోంది! సాధారణంగానే ఆధ్యాత్మిక భావం ఎక్కువగా ఉన్న కేసీఆర్ స్వయంగా పరిపూర్ణానందను కలవడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం! ఇటీవలే.. దూకుడు పెంచిన […]
దేవినేని తనయుడికి కీలక బాధ్యతలు
పార్టీలో యువశక్తిని బలోపేతం చేసేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. అందుకు ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న తెలుగు యువత అధ్యక్ష పదవిని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ.. తనయుడు అవినాశ్కు ఈ పదవిని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్కు.. అవినాశ్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే తన సొంత వర్గాన్ని తయారుచేసుకునే పనిలో చినబాబు కూడా నిమగ్నమై ఉండటంతో.. ఇక అవినాశ్ ఎంపిక లాంఛనమే […]
రాష్ట్రపతి పోరులో ఎన్డీయే బలం ఎంత..! గట్టెక్కుతుందా..!
ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం మరికొన్ని నెలల్లో ముగుస్తున్న వేళ.. కొత్త రాష్ట్రపతి ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే లోక్సభలో పూర్తి మెజారిటీ ఉన్నా.. రాజ్యసభలో మాత్రం ఇంకా మెజారిటీ సాధించలేకపోయింది. యూపీలో ఘనవిజయం సాధించినా.. ఇంకా రాజ్యసభ ఎంపీల పదవీ కాలంపూర్తికాకపోడంతో వేచిఉండక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి పోరులో ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి విజయం ఎంత వరకూ సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో.. ఇప్పటికే కీలకమైన బిల్లులను ఆమోదించుకోలేక […]
బాబు నిన్నటి ఆనందం నేటితో ఆవిరి
ఆనందం ఇంతలోనే ఆవిరైపోయింది. గెలిచామన్న సంతోషం రాత్రి గడవగానే ఎగిరిపోయింది. నిన్న ఉల్లాసంగా కనిపించిన నేతలే.. నేడు నిరుత్సాహంతో కుంగిపోతున్నారు. ఏపీలో అధికార పక్షానికి ఊహించని షాక్ ఎదురైంది. కడప, నెల్లూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుని ఊపు మీదున్న టీడీపీకి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాల్లో గెలిచామని సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు ఆనందాన్ని.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆవిరి చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని రెండు పట్టభద్రుల […]
వైసీపీలోకి మంచు ఫ్యామిలీ ఎంట్రీ..!ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!
టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి సపరేట్ క్రేజ్ ఉంది. విలక్షణ నటుడు మోహన్బాబు రూటే ఓ సపరేటుగా ఉంటుంది. మోహన్బాబుకు ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయ రంగంతోను ఎంతో అనుబంధం ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు విపక్ష వైసీపీతోను ఆయనకు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. ఏపీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు మోహన్బాబుకు వరుసకు మేనత్త కొడుకు అవుతాడు. ఇక విపక్ష వైసీపీ అధినేత జగన్ అయితే అల్లుడు వరుస అవుతాడు. గతంలో […]
పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ..అనంతపురం అయితే కాదు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల బరిలో ఉండడం ఫిక్స్ అయ్యింది. పవన్ ఇప్పటికే రెండుమూడుసార్లు జనసేన 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని, తాను రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏపీలో 2019 ఎన్నికలు మూడు ముక్కలాటను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో రాజకీయంగా పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై పెద్ద చర్చ […]
తబ్బిబ్బైపోతున్న కాపు నేతలు … కారణం అదే !
అంతెత్తున ఎగిసిన కాపు ఉద్యమం చప్పగా చల్లారిపోయింది. అప్పట్లో వార్తల్లో నిలిచిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరు.. ఇప్పుడు వినిపించడమే మానేసింది. ప్రస్తుతం బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు రూ.1000కోట్లు కేటాయించి.. ఏపీసీఎం చంద్రబాబు తన మార్క్ మరోసారి చూపించారు. కాపులకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్న వారు కిక్కురుమనకుండా చేసేందుకు.. కాపు ఉద్యమాన్ని మరింత నీరుగార్చేందుకు ఇప్పుడు బాబు సరికొత్త వ్యూహంతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. కాపుల తరఫున ముద్రగడ పద్మనాభంఉద్యమిస్తున్నా… అడుగడుగునా ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికే […]
టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ” మంత్రి ” చిచ్చు
టీఆర్ఎస్ పార్టీలోని విభేదాలు సీఎం కేసీఆర్కు తలనొప్పిగా మారుతున్నాయి. మంత్రి పదవి విషయంలో తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే వరకూ వెళ్లింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకునే స్థాయికి చేరుకుంది. చాలెంజ్లు చేసుకున్నారు కూడా! మీడియా ముఖంగా ఉదయం.. తీవ్రంగా విమర్శలు చేసుకున్న వారే.. సాయంత్రం ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. తమ మధ్య విభేదాలు లేవంటూనే మరోసారి విమర్శించుకున్నారు. దీంతో ఆశ్చర్య పోవడం టీఆర్ఎస్ నాయకులు, […]