ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె. అద్వానీ నుంచి పెద్ద షాక్ తగిలింది! వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరమీదకి వచ్చినప్పుడు కూడా గోద్రా ఘటన నేపథ్యంలో అద్వానీ.. గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా.. పార్టీ అద్వానీ సలహాను పక్కనపెట్టి మోడీని ప్రధానిని చేసింది. ఇక, ఇప్పుడు మళ్లీ అద్వానీ అదే విధమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. మోడీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల […]
Tag: Modi
పవన్ మూడో సభలో ఆయనే టార్గెట్..!
జన సేనాని పవన్ కళ్యాణ్ త్వరలోనే నిర్వహిస్తానని ప్రకటించిన అనంత బహిరంగ సభపై ప్రజల్లో ఆశలు పెరిగాయి. ముఖ్యంగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసమే తన పోరు సాగుతుందని ప్రకటించిన పవన్.. ఈ సారి ఎవరిని టార్గెట్గా చేసుకుంటారో? ఎవరిమీద పంచ్లు విసురుతారో? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎవరి అంచనాలు, లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. వపన్ నిర్వహించే సభలకు ఓ ప్రత్యేకత కూడా […]
మోడీ తరువాత ఈ ఘనత ప్రభాస్ కె దక్కింది
వచ్చే 2017 సంవత్సరంలో బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం బాహుబలిని ఆవిష్కరించబోతుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూల్లు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను ఈ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదంచిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చ్ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మైనపు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత, ఈ […]
వావ్, మోడీని పొగిడేసిన రాహుల్
ప్రధానమంత్రిగా రెండేళ్ళ పదవీ కాలంలో నరేంద్రమోడీ చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే, పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్కి సైన్యాన్ని ముందుకు నడిపించడమేనట. మామూలుగా అయితే రాజకీయాల్లో ఉన్నాక, అధికారంలో ఉన్నవారు ఏ మంచి పని చేసినా, దాన్ని విపక్షాలు హర్షించవు. అయితే ఇది దేశ భద్రతతో కూడుకున్న విషయం. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దాంతో నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ని సమర్థిస్తున్నాం అని చెప్పి ఊరుకుంటాయి ఇష్టం లేకపోయినాసరే […]
టీడీపీ, టీఆర్ఎస్ను మోడీ కావాలనే టార్గెట్ చేస్తున్నారా
కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయడం కొత్తకాదు! తమకు నచ్చని ప్రభుత్వాలను, తమకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం కేంద్రంలోని పాలకులకు తేలికైన విద్య.! ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు! ఈ పార్టీకి నచ్చని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై పెత్తనం చేయడం, ఇబ్బందులు పెట్టడం కాంగ్రెస్ పాలకుల నైజం. ఈ క్రమంలో కాంగ్రెస్ సీబీఐని ఇష్టానుసారంగా ప్రయోగించేదని ప్రచారంల ఉందేది. ఇక, […]
జగన్ పట్టువదలని విక్రమార్కుడు.
ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీతో సరిపెట్టుకున్నప్పటికీ, ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ మాత్రం ససేమిరా అంటోంది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననే నినాదంతో ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్ జగన్ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ముందుగా యువతలో ప్రత్యేక హోదాపై చైతన్యం కలిగిస్తున్నారాయన. ఓ వైపు పార్టీ వేదికలపైనా, ఇంకో వైపు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా, ఇవి కాకుండా తన మీడియా సంస్థల ద్వారా సమాజంలోని అన్ని […]
పాక్పై మోడీ కొత్త యుద్ధం
భారత్ను డైరెక్టుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త యుద్ధం ప్రకటిస్తున్నారా ? బుల్లెట్ పేలకుండానే పాకిస్తాన్ను దారిలోకి తెచ్చుకునేందుకు మోడీ రెడీ అవుతున్నారా ? జలాస్త్రంతో పాకిస్తాన్కు మోడీ చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారా ? అంటే అవుననే సమాధానాలు విశ్వసనీయవర్గాల ద్వారా వస్తున్నాయి. గత ఆదివారం జమ్మూకశ్మీర్లోని ఉరీ సెక్టార్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 18 మంది మన జవాన్లు వీర మరణం పొందడం […]
టీడీపీని ఖాళీ చేసే పనిలో బీజేపీ
మిత్రధర్మాన్ని బీజేపీ పక్కన పెట్టబోతోందా? ఇక సొంతంగా తెలంగాణలో ఎదిగేందుకు పావులు సిద్ధంచేస్తోందా? విమోచన దినాన్ని బీజేపీ అట్టహాసంగా నిర్వహించడం వెనుక అసలు వ్యూహం ఏమిటి? టీడీపీ, కాంగ్రెస్లు ఢీలా పడిపోయిన సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. వరంగల్ పర్యటన ఆ పార్టీకి ఎంత వరకూ మైలేజ్ తీసుకొచ్చింది? ఇదే సమయంలో టీడీపీని ఖాళీ చేసే పనిలో బీజేపీ పడిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి! తెలంగాణలో ప్రధాని మోడీ తొలి పర్యటన సూపర్ […]
మోడీ పొగిడారు, అమిత్ షా విమర్శించారు.
రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్ఎస్ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కెసియార్ని విమర్శించారు. కెసియార్ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో […]