నాగ్-అమ‌ల పెళ్లి త‌ర్వాత అంత క‌థ న‌డిచిందా?

సీనియర్ న‌టుడు అక్కినేని నాగేశ్వర‌రావు న‌ట వారసుడు గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. తండ్రి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్న నాగ్‌.. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే మొద‌ట‌ ఈయ‌న ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత.. ఈ దంప‌తులు ప‌లు కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాగార్జున హీరోయిన్ అమ‌ల‌ను ప్రేమించి […]

తల కిందులుగా అల్లు స్నేహా యోగాసనం..బ‌న్నీ ఫ్యాన్స్ ఫిదా!

అల్లు వారి కోడ‌లు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల్లో న‌టించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియా ద్వారా హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న స్నేహా.. ఎప్ప‌టిక‌ప్పుడు తమదైన శైలిలో అభిమానులను ఆక‌ట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈమె తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేసింది. చాలా రోజుల నుంచి యోగాలో శిక్షణ తీసుకుంటున్న స్నేహారెడ్డి.. తాజాగా తాడు సహాయంతో తల కిందులుగా మారి యోగాసనం వేసింది. అంతేకాదు, […]

త్వ‌ర‌లోనే పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన పీవీ.సింధు!

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి.. క్రీడాకారుల‌కు స్ఫూర్తిగా నిలిచింది పీవీ సింధు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఒలింపిక్ సన్నాహాల్లో మునిగిపోయింది. ఈ సారి ఖ‌చ్చితంగా బంగారు పతకంతోనే తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేసిన సింధు.. ప్రాక్టీస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. సింధు పెళ్లి గురించి గ‌త కొంత కాలంగా అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి […]

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..27 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న మాత్రం క‌రోనా కేసులు భారీగా త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]

జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్స్ వెళ్లేనా…?

తెలుగులో మొత్తంగా 4 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇక 5వ సీజన్ కు రెడీ అవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 జూలై లేదా ఆగష్టు నెలల్లో మొదలు అవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో ఇక టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ బృందం వారు ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, జబర్దస్త్ హైపర్ […]

స్టేజ్ పై కత్రినాకు ప్రపోజ్ చేసిన విక్కీ..?

సెలబ్రిటీల ప్రేమలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వారి బ్రేకప్ వ్యవహారాలు, ప్రేమ రిలేషన్ షిప్ వ్యవహారాలు అన్నీ కూడా మనకు సోషల్ మీడియా తెలియజేస్తూనే ఉంటుంది. ఇకపోతే బాలీవుడ్ లో లవ్ కపుల్స్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అర్జున్ కపూర్ -మలైక అరోరా, రణ్‏బీర్ కపూర్-అలియా భట్, దిశ పటాని-టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ గురించి బాలీవుడ్ లో ఎన్నో స్టోరీలు రన్ అవుతూనే ఉన్నాయి. అయితే కత్రినా కైఫ్-విక్కీ […]

బ‌న్నీ నిర్ణ‌యంపై మైత్రీ అసంతృప్తి..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్గింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వ‌ర‌లోనే మొద‌టి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]

టీటీడీకి ప్ర‌ముఖ‌ నిర్మాత రూ.కోటి విరాళం!

సినీ నిర్మాత‌, ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ అధినేత‌, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్‌ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళం అందించారు. స‌తీస‌మేతంగా బుధవారం స్వామిని దర్శించుకున్న ఆనందప్రసాద్‌.. అనంతరం టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన కోటీ రూపాయ‌ల చెక్‌ను అందించారు. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఆనంద ప్రసాద్.. టీటీడీకి గతంలోనూ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం […]