నా కన్నీళ్లను ఢిల్లీలో చెప్పండి.. ఎంపీలకు బాబు హుకుం

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో ఏయే అంశాలపై మాట్లాడాలో ఆయన వారికి సూచనలు చేశారు. ఇది ప్రతిసారీ జరిగే తంతే. సాధారణంగా ఢిల్లీ పాలనకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఈ సూచనలుగా వస్తుంటాయి. అయితే ఈసారి చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అన్నీ.. పార్లముంటలో చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వార్తల్లో […]

మెగాస్టార్ విన్నవించారు.. జగన్ పట్టించుకుంటారా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి విరమించుకున్నాక.. ప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ప్రతిసారీ.. జగన్ నిర్ణయాలను సమర్థించే డైలాగులు రావడమూ.. అలాగే.. జగన్ తో స్నేహపూర్వక భేటీలు ఇలా ఆయన ప్రస్థానం సాగుతోంది. అయితే తాజా విషయంలో మాత్రం.. చిరంజీవి తన విజ్ఞప్తిని జగన్ ముందు ఉంచారు గానీ.. ముఖ్యమంత్రి పట్టించుకుంటారనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. ఏపీలో సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడంతో పాటు, టికెట్ ధరలను ప్రభుత్వమే […]

సర్కారు చేతుల్లో ఇక ‘షో’

అనుకున్నదే అయింది.. కాదు అనుకున్నదే చేశారు.. థియేటర్లలో ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకుల జేబులకు చిల్లులు వేస్తున్నారని ప్రభుత్వం కొద్ది రోజులుగా చెబుతోంది. అందుకే టికెట్ల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని జగన్ భావించారు. చాలా రోజులుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. అయినా.. గుర్రం ఎగురా వచ్చు అని సినిమా పెద్దలు జగన్ వైపు ఆశగా చూశారు. నో.. చాన్స్ జగన్ అనుకున్నాడంటే ట్రిగ్గర్ నొక్కాల్సిందే. అనుకున్నది అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేశాడు. ఏపీ సినిమాల […]

నవ్వు తెప్పిస్తున్న ‘జూనియర్ నారా’ వారి మాటలు

రాజకీయాలు రాకపోతే నేర్చుకోవాలి..ఇంకా ముందుకువెళ్లి వంటబట్టించుకోవాలి.. ఎప్పుడేం మాట్లాడాలో తెలియాలి.. లౌక్యంగా ఉండాలి..ఇలా ఉంటాయి సాధారణంగా రాజకీయ నాయకుల వ్యవహారాలు..అయితే నారా లోకేష్ మాత్రం ఇంకా రాజకీయాలు వంటబట్టించుకున్నట్లు లేదు. తన తండ్రి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోన్నట్టు ఉన్నాడు.. ఇంకా తండ్రి చాటు బిడ్డలాగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన మాటలు.. చేతలు చూసి తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారట. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ బుధవారం పర్యటించారు. కోవిడ్ కాటుకు బలైన వారి కుటుంబాలను పరామర్శించారు. మంచిదే.. […]

జగన్ స్క్రిప్ట్ .. మొత్తం సస్పెన్స్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.. సీనియర్ రాజకీయవేత్తగా ఆలోచిస్తూ ప్రతిపక్షాలకు కాదు.. సొంత పార్టీ నాయకులకే షాక్ ఇస్తున్నాడు. అనుకున్నది అందరికీ చెప్పడు.. ఇక చెబితే అది జరగి తీరాల్సిందే.. ఇదీ జగన్ స్టైల్. అసెంబ్లీలో ఇటీవల మూడు రాజధానుల బిల్లు విషయంపై మాట్లాడుతూ ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఆనందపడదామనుకునేలోపే మరో బాంబు పేల్చాడు. పకడ్బందీగా బిల్లును మరోసారి ప్రవేశపెడతామని చెప్పడంతో టీడీపీ […]

చంద్రబాబు.. అదే అరిగిపోయిన రికార్డు

చంద్రబాబు నాయుడు.. సీనియర్ పొలిటీషియన్.. దేశంలో ఉన్న సూపర్ సీనియర్ నాయకుల్లో ఈయనా ఒకరు.. అన్నీ తానై పార్టీని ఒంటిచేత్తో నడిపించిన నాయకుడు.. అయితే అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు నాయుడికి ఏమీ పాలుపోతున్నట్లు లేదు.. ఎప్పుడూ అదే అరిగిపోయిన రికార్డు వేస్తూ జనాలను, కార్యకర్తల ఓపికకు సహనాన్ని పెడుతుంటారు. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నా.. ఎన్నో చూశా.. నన్ను వీళ్లేమి చేస్తారు.. ఎన్ని కేసులు పెట్టలేదు.. ఒక్క దానిని కూడా నిరూపించలేకపోయారు.. 40 ఏళ్ల రాజకీయ […]

జగన్ కు షాక్ కాని షాక్..

ఏపీలోని అధికార వైసీపీ లో ఏదో జరుగుతోంది.. ఎక్కడో అసంత్రుప్తి గూడు కట్టుకుంటోంది.. బయటకు చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే ఒక సమస్య.. అధినేతకు కోపమొస్తే ఇబ్బందులు..దీంతో కడప జిల్లాలో వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ సర్పంచులు మదనపడుతున్నారట. వైసీపీ మద్దతు దారులు సర్పంచుల స్థానాల్లో కూర్చున్నారు. చాలా మంది సొంత డబ్బుతో పల్లెల్లో పనులు చేయిస్తున్నారు. చాలా రోజులైంది చేసిన పనులకు డబ్బు రాలేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఏమైనా కానీ అని ఓ […]

మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]

మంత్రి సీటువైపు మనసు లాగుతోంది..

రాజకీయాల నుంచి ఇక రిటైర్ కావాలని అనుకుంటున్నా.. స్పీకర్ సీటు బోరు కొట్టింది.. మంత్రిని చేయండి.. కొద్ది రోజులు పనిచేసి ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతా అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం జగన్ ను కోరుతున్నారట. ఎలాగైనా సరే కేబినెట్ లో బెర్త్ దక్కించుకోని తమ్మినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన తమ్మినేని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సమకాలీకులు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయన ఆముదాల […]