ఏపీలో ఉద్యోగులకు హ్యాపీ.. పీఆర్‌సీకి జగన్‌ అంగీకారం

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కరుణించారు. పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ) పది రోజుల్లో ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు పెరగనున్నాయి. శుక్రవారం సీఎం జగన్‌ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు సీఎంను కలిసి పీఆర్‌సీ ఇవ్వాలని కోరినప్పుడు జగన్‌ ఈ మాట ఇచ్చేశారు. సీఎం నుంచి ఈ సమాధానం ఊహించని ఉద్యోగ సంఘాల నాయకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇప్పటికే […]

ఇదేం చోద్యం.. మా పథకాలకు మీపేర్లేంటి?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు సంక్షేమ పథకాలకు పెట్టడం సాధారణమే. అనేక సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు చంద్రన్న బీమా, పసుపు..కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెడితే వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నపుడు రాజీవ్‌ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పేర్లుపెట్టారు. ఇప్పుడు వైఎస్‌పీ అధికారంలో ఉంది. అందుకే అక్కడ వైఎస్‌ఆర్‌పేరు లేదా జగన్‌ పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దాదాపు అన్ని పథకాలు ఈ […]

మోదీని కలవాలనుంది…!

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి దగ్గర కావాలనుకుంటున్నాడా? వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడా?.. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ తన ప్రాభవం కోల్పోయిందనే చెప్పవచ్చు. పలువురు నాయకులు తెలుగుదేశం నుంచి బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. జగన్‌ పార్టీ పవర్‌లోకి వచ్చిన […]

తుని వద్దు..ప్రత్తిపాడు సేఫ్‌

యనమల రామకృష్ణుడు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు..వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ ధీరుడు.. తుని నియోజకవర్గం అంటే యనమల.. యనమల అంటే తుని అని చెప్పుకుంటారు. 1983లో రాజీకయాల్లోకి వచ్చిన యనమల ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నాడు. తుని నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారాలని యనమల కుటుంబం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న యనమలకు 2009లో ఓటర్లు షాక్‌ ఇచ్చారు. దీంతో ఆయన ఓటమి అంటే ఏమిటో అప్పుడు రుచిచూశారు. ఆ తరువాత ఇక […]

సర్కారు ఉద్యోగుల సమ్మె బాట

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సమస్య తీవ్రమైంది. నిధుల కోసం రాష్ట్రం అన్ని దారులనూ వెతుకుతోంది. ఎక్కడ అవకాశముంటే అక్కడ తీసుకుంటోంది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతినెలా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు వచ్చినా అంతా సంక్షేమ పథకాలకే సరిపోతోంది.. నవరత్నాల్లో భాగంగా ప్రారంభించిన పలు పథకాలకు నిధులు సమకూర్చలేక ఆర్థికశాఖ అవస్థలు పడుతోంది. ఈ ప్రభావం మొత్తం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై పడింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు […]

ఒకచోట వసూలు.. మరోచోట రద్దు

ఓటీఎస్.. వన్ టైం సెటిల్మెంట్.. ఇటీవల మీడియాలో కనిపిస్తున్న పదం ఇది.. ముఖ్యంగా ఏపీ మీడియాలో ఓటీఎస్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది.. ఏమిటీ ఓటీఎస్ అంటే.. ఏపీ హిసింగ్ బోర్డు నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకొని ఆ తరువాత బకాయిలు లక్షలాది మంది చెల్లించలేదు. అవి అలాగే పేరుకుపోయాయి.. ఇప్పట్లో ఎవరూ చెల్లించే పరిస్తితి కూడా లేదు.. అందుకే ప్రభుత్వం కాస్త డిఫరెంటుగా ఆలోచించి.. తీసుకున్న మొత్తం లబ్ధిదారులు ఎలాగూ కట్టే పరిస్థితి లేదు.. […]

ఎన్టీఆర్ యూనివర్సిటీపై జగన్ కన్ను?

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం.. ప్రముఖ యూనివర్సిటీ..విజయవాడలోని ఈ ప్రముఖ విద్యాసంస్థ నిధులపై ప్రభుత్వ కన్ను పడింది.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమస్య ఏర్పడటంతో నిధి సమీకరణలో ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వర్సిటీకి చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వర్సిటీ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.250 కోట్ల నిధులున్నాయి. అవన్నీ ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి […]

తిరుమల దర్శనాన్ని వాయిదా వేసుకోండి.. టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు తమ దర్శనాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల రెండో కనుమదారిలో ఇవాళ ఉదయం కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం రెండో కనుమదారిలో కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఘాట్ రోడ్డుపై పడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు భారీగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రాళ్లు పడ్డ ప్రాంతంలో వాహనాలు ఏమీ […]

టీడీపీకి నైతికబలం ఇస్తున్న ఉండవల్లి మాటలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న విలువ అందరికీ తెలుసు. తాను నమ్మిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిగా, దాని కోసం ఎంతవరకైనా తెగించి పోరాడే వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులైన మేధావి నాయకులలో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ముందు వరుసలో ఉంటారు. వైఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన మార్గదర్శి వ్యవహారాలకు సంబంధించి ‘ఈనాడు’ రామోజీరావు మీద కేసులు […]