టీటీడీ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు జోరుగా లాబీయింగ్ మొదలుపెట్టారట. శ్రీవారి సేవలో తరించాలంటే .. ముందుగా సీఎం చంద్రబాబు ఆశీర్వాదం తప్పనిసరి. దీంతో ఇప్పుడు ఈ పదవి ఆశిస్తున్న నేతలు.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో ఎంపీ రాయపాటి సాంబశివరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ చంద్రబాబు దృష్టిలో వేరే వ్యక్తి పేరు మెదలుతోందట. దీంతో ఇక రాయపాటికి ఈసారీ నిరాశే ఎదురవవచ్చనే ప్రచారం వినిపిస్తోంది. ఈసారి ఈపదవి వివాదరహితుడు, తనకు […]
Category: Latest News
టీడీపీకి రావెల గుడ్ బై..! ఏపీ బీఎస్పీ అధ్యక్ష పదవికి చూపు
ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో ఉద్వాసనకు గురైన గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్బాబు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నాడా ? మంత్రి పదవి నుంచి తనను తప్పిస్తారని ముందే ఊహించిన రావెల ఈ మేరకు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రణాళికలు వేసుకున్నాడా ? అంటే ఏపీ ఇంటిలిజెన్స్ వర్గాలు సీఎం చంద్రబాబుకు అందించిన నివేదిక ప్రకారం అవుననే ఆన్సరే వస్తోంది. కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన రావెల కిషోర్బాబుకు చంద్రబాబు గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా […]
బాబుకు షాక్: జగన్ చెంతకు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు
ఏపీ కేబినెట్ ప్రక్షాళన అధికార టీడీపీలో సెగలు రేపుతోంది. మంత్రి పదవి రాదని డిసైడ్ అయిన చాలా మంది సీనియర్లు బాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కొందరైతే తమకు మంత్రి పదవి రాకపోయినా ఓకే గాని..తమ శత్రువులకు మంత్రి పదవి వస్తే పార్టీ వీడేందుకు కూడా సిద్ధమే అని బాబుకు హెచ్చిరికలు పంపుతున్నారట. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని రామసుబ్బారెడ్డి ఇప్పటికే బాబును కలిసి చెప్పేశారట. ఈ […]
కాంగ్రెస్ దూకుడుకు `సెంటిమెంట్`తో టీఆర్ఎస్ కళ్లెం
తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రచారం ఉద్ధృతం చేస్తోంది. నాయకులు కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు వీరి దూకుడుకు కళ్లెం వేసేందుకు మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని టీఆర్ఎస్ బయటకు తీసింది. తెలంగాణ వాదాన్ని మరోసారి వినిపించాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రజలను మరోసారి తమ సెంటిమెంట్ బంధాల్లో కట్టేయడానికి కేసీఆర్ అండ్ కో సిద్ధమైంది. తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిందే టీఆర్ఎస్ అని.. మిగిలిన పార్టీల వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని నమ్మబలికే ప్రయత్నం […]
జగన్ కొంప ముంచుతున్న బాబు కోవర్టులు
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో ఆ పార్టీ నేతల్లో గందరగోళం మొదలైంది. జగన్కు చెందిన ఒక చానెల్లో.. కేసులకు సంబంధించిన వ్యక్తికి ఇంటర్వ్యూ చేసిన సమయంలో.. ఈ కేసుల గురించి ప్రస్తావించడంతోనే ఇదంతా జరిగిందని వారు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కేసుల గురించి ఎవరు అడగమన్నారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదని తెలిసినా.. వీటి గురించి అడిగేలా చేస్తున్నదెవరు? జగన్ […]
ఏపీ కేబినెట్లో 5 గురు అవుట్ – 11 మంది ఇన్
యేడాదిన్నర కాలంగా ఊరించి ఊరించి వస్తోన్న ఏపీ కేబినెట్ ప్రక్షాళన కూర్పు ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ ప్రక్షాళనలో ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే ఐదుగురు మంత్రులకు చంద్రబాబు ఉద్వాసన పలికారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాతతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని, చిత్తూరు జిల్లా నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా నుంచి రావెల కిషోర్బాబు, అనంతపురం జిల్లా నుంచి పల్లె రఘునాథ్రెడ్డిని తప్పించారు. ఇక కొత్తగా […]
బ్రాహ్మణి ఎంట్రీతో ఆ ఇద్దరు ఎంపీలకు టెన్షన్..!
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఇద్దరు ఎంపీలను తెగ టెన్షన్ పెడుతున్నారు. ఇటు మంత్రి వర్గ విస్తరణతో చంద్రబాబు..మంత్రులను టెన్షన్ పెడుతుంటే.. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల్లో గుబులు పుట్టిస్తున్నారు ఆయన కోడలు బ్రాహ్మణి! ముఖ్యంగా చంద్రబాబు కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే వారి జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఆయన తనయుడు.. ఎమ్మెల్సీగా రాజకీయాల్లో ప్రవేశించారు. ఇప్పుడు ఆయన కోడలు బ్రాహ్మణి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారనే లీకులు ఇప్పుడు ఇద్దరు ఎంపీలను […]
చిరు తీరుపై పార్టీలో తీవ్ర అసహనం
రాష్ట్ర రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు ఇక వినిపించదా? తన తమ్ముడు, జనసేనాని రాజకీయ భవిష్యత్తు కోసం.. ఏపీ పాలిటిక్స్ నుంచి చిరు వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారా? ఇక రాజకీయాల కంటే సినిమాలే బెటర్ అని ఫిక్స్ అయిపోయారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ సమావేశాల్లో ఆయన ఒకసారి కూడా పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు చిరు కలవరం మొదలైంది. ఇక ఆయన పార్టీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారనే గుసగుసలు జోరుగా పార్టీ వర్గాల్లో […]
మరోసారి వైసీపీని వెంటాడుతున్న ఆపరేషన్ ఆకర్ష్
రెండేళ్లలో తమ అధినేత సీఎం పగ్గాలు అందుకుంటాడని కలలు కంటున్న వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైంది. టీడీపీ పని అయిపోయిందని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజన్య రాజ్యం వస్తుందని కలలు కంటున్న కార్యకర్తల్లో కలవరం మొదలైంది. వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ నేత జైలుకు వెళితే.. ఏంటనే ప్రశ్నలు, సందేహాలు అందరి మెదడును తొలిచేస్తున్నాయి. తర్వాత తమ భవిష్యత్తు ఏంటని ఇప్పటినుంచే […]