పార్ట్ టైం పొలిటీషియన్.. ఈ పదం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత తనయుడు, మంత్రి నారా లోకేష్ కొంతమందిని ఉద్దేశించి `పార్ట్టైం పొలిటీషియన్` అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. మరి పవన్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్పై సెటైర్లు పడుతున్నాయి. పార్టీలో […]
Category: Latest News
టీడీపీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రి
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-టీడీపీ మధ్య మిత్ర బంధం తెగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్..ప్రధాని మోదీతో భేటీ అనంతరం అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలే హీట్ పెరిగిపోతున్న సమయంలో కేబినెట్లోని బీజేపీ మంత్రి.. మరో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు మారింది. మద్యం అమ్మకాల విషయంలో తీవ్ర విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న […]
మాటలతో కానిది భేటీతో సాధ్యమైందా?
మాటల వల్ల చెప్పలేనిది మీటింగుల వల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు అలాంటి ఒకే ఒక్క మీటింగ్ ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. వైసీపీ నేతల్లో జోష్ నింపుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధాని మోదీతో ప్రతిపక్ష నేత జగన్ భేటీ.. ఏపీలో రాజకీయ సమీకరణాలను మార్చబోతోంది. 2019లో జగన్ జైలుకు ఖాయమని, ఇక అధికారం శాశ్వతమని భావిస్తున్న నేతలకు ఒక్కసారిగా గొంతులో వెలగపండు పడినంత పనయింది. ఇదే సందర్భంలో పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకునే […]
పవన్ అభిమానులకు తీపి, చేదు కబురు
అనుకున్నదంతా అయింది. రెండు పడవల మీద ప్రయాణం చేస్తాడనుకున్న తమ నాయకుడు పెద్ద బాంబు పేల్చాడు. అవసరమైతే సినిమాలు కూడా మానుకుంటానని తేల్చిచెప్పడంతో ఆయన అభిమానులంతా నిరాశ చెందారు. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు తీపి కబురుతో పాటు చేదు కబురు కూడా అందించాడు. ఇప్పుడు సంబరపడాలో లేక నిరుత్సాహపడాలో తెలియక సతమతమవుతున్నారు. రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాడు. అంతేగాక తనను పార్ట్టైమ్ రాజకీయనాయకుడని విమర్శలు గుప్పిస్తున్న […]
రైతులకు బేడీలు.. దిగొచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైన ఖమ్మం రైతులకు బేడీల వ్యవహారంపై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. తనను తాను ఆత్మ రక్షణలో పడేసుకున్న ఈ వ్యవహారం నుంచి చాలా సున్నితంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. రైతులకు బేడీలు వేయడాన్ని కేసీఆర్ మంత్రి వర్గం తీవ్రంగా ఖండించి, దానిని తప్పేనని ఒప్పుకుంది. అదేసమయంలో బాధ్యులైన ఇద్దరు ఎస్పైలను సస్పెండ్ చేసింది. అయితే, కేసీఆర్ మాత్రం.. ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందికాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతాంగాన్ని ఊరడించేందుకు […]
వాకాటి గురించి వైసీపీ ముందే చెప్పిందా?!
అవినీతి ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై జగన్ పార్టీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది. వాకాటిని టీడీపీలోకి చే్ర్చుకునే ముందే తాము హెచ్చరించామని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రజల దృష్టిని మార్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్, రాయపాటి సాంబశిరావులపై […]
మంత్రి పదవి పాయే…. ఎమ్మెల్యే టిక్కెట్టు కష్టమే..!
ఎన్నో ఆశలతో, మంత్రి హామీతో వైసీపీ నుంచి సైకిలెక్కిన ఎమ్మెల్యే పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారిపోయిందట. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరు పరిగనణలోకి కూడా తీసుకోకపోవడంతో ఇప్పటికే ఆయన అసంతృప్తిలో ఉన్నారట. పార్టీలో చేరే సమయంలో సీఎం చంద్రబాబు.. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా చివరి నిమిషంలో పట్టించుకోలేదట. ఇప్పుడు దీనికి తోడు.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలో […]
ఆ ఇద్దరి భేటీతో మిత్ర బంధానికి బ్రేక్ పడిందా?
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి సరైన నిర్వచనంలా మారుతున్నాయి. కొత్త పొత్తులకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ-బీజేపీ నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అనంతరం.. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం అంతర్గతంగా ఉన్న విభేదాలు.. మరోసారి బయటపడ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు పలికేలా […]
హైదరాబాద్ కమిషనర్గా సీబీఐ మాజీ జేడీ?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసును సమర్థంగా విచారించి సంచలనాలకు కేంద్రంగా మారిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు మరోసారి తెలుగురాష్ట్రాల్లో వినిపించబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డితో భేటీ కావడం వెనుక కారణమేంటనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. మరో ఐదేళ్లలో సర్వీస్ ముగించుకోబోతున్న ఆయన.. హైదరాబాద్లో తన సర్వీసు ముగించాలని భావిస్తున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో మళ్లీ […]