పార్టీలు రెడీ… నంద్యాల నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..!

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల సీటుకు జ‌రుగుతోన్న ఉప ఎన్నికకు నోటిఫికేష‌న్ రాకుండానే ఇక్క‌డ టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య వార్ అదిరిపోతోంది. అప్పుడే ఎన్నిక హీటు రాజుకుంది. ఇప్ప‌టికే రెండు పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించేశాయి. టీడీపీ అభ్య‌ర్థిగా భూమా అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు ఖ‌రారు కాగా వైసీపీ అభ్య‌ర్థిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డికి జ‌గ‌న్ సీటు ఇచ్చారు. చంద్ర‌బాబు అయితే ఇప్ప‌టికే […]

టీడీపీలో ఈ న‌లుగురికి ఎమ్మెల్యే సీటు

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చ‌కచ‌కా జ‌రుగుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సెప్టెంబ‌ర్ నుంచి ఈ ప్ర‌క్రియ వేగం కానుంద‌ని కేంద్రం నుంచి వ‌స్తోన్న వార్త‌ల‌తో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కుల్లో ఎక్క‌డా లేని ఉత్సాహం నెల‌కొంది. ఇదిలా ఉంటే ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మీద అధికార టీడీపీ నాయ‌కులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఈ జిల్లా నుంచి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు […]

జ‌గ‌న్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్‌..!

ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీసీట్ల పెంపు, కొత్త నియోజ‌క‌వ‌ర్గాల ఏర్పాటుపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం చంద్ర‌బాబు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు కోసం తెగ త‌హ‌త‌హ‌లాడిపోతోన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో లాభ‌ప‌డాల‌న్న‌దే ఆయ‌న ప్ర‌ధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు 225 కానున్నాయి. ఇక 2009 ఎన్నిక‌ల్లో అప్ప‌టి సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని విజ‌యం సాధించారు. రాజ‌కీయంగా […]

ఏపీ మంత్రుల్లో నెంబ‌ర్ 1 బ‌ద్ద‌క‌స్తుడు ఎవ‌రంటే…

ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్ర‌బాబు వ‌య‌స్సు మంత్రుల‌తో పోల్చుకుంటే ఎక్కువే అయినా మంత్రుల క‌న్నా ఆయ‌నే బాగా క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇక మంత్రుల్లో చాలా మంది మ‌హాబ‌ద్ద‌క‌స్తులుగా మారిపోయారు. త‌మ శాఖ‌కు సంబంధించి వ‌చ్చిన ఫైళ్ల‌ను క్లియ‌ర్ చెయ్య‌డంలో వారు రోజులు కాదు వారాలు, నెల‌లు త‌ర‌బ‌డి టైం తీసుకుంటున్నారు. మంత్రులు ఫైళ్ల‌ను క్లియ‌ర్ చేయ‌డంలో ఎంతెంత టైం తీసుకుంటున్నార‌న్న ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త ప్ర‌కారం జీఏడీ రిపోర్టులు ఏం చెపుతున్నాయో చూద్దాం. […]

తూర్పు గోదావ‌రికి ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు..!

ఏపీలో అధికారం ద‌క్కించుకునేందుకు కీల‌కమైన జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఏపీలోని 13 జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లాలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 19 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ జిల్లా నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మూడు ఎంపీ సీట్లు, మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. ఇక 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు తూర్పు గోదావ‌రిలో 21 అసెంబ్లీ సీట్లు ఉండ‌గా పునర్విభ‌జ‌న‌లో రెండు కోల్పోవాల్సి […]

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోటీగా ప‌వ‌న్ ర‌థ‌యాత్ర‌

2019 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన‌ ప‌వ‌న్ ప్ర‌జాక్షేత్రంలోకి దిగ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప‌వ‌న్ పార్టీ ఇంకా క్షేత్ర‌స్థాయిలోనే బ‌లోపేతం కాలేద‌ని, మ‌రి ఈ టైంలో ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు ఎలా వెళ‌తాడు ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇక పవ‌న్ ఎట్ట‌కేల‌కు పార్ట్ టైం పొలిటిషీయ‌న్ అన్న విమ‌ర్శ‌లు రాకుండా ఫుల్ టైం […]

ఆ ముగ్గురు చూపు టీడీపీ వైపు…

ఒక‌ప్పుడు ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు – కొణతాల రామకృష్ణ – సబ్బం హరి చాలా కాలంగా తెరవెనక్కు వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు ఈ ముగ్గురు సీనియ‌ర్లు ఓ రేంజ్‌లో రాజ‌కీయాల్లో రాణించారు. ఇప్పుడు వీరి వాయ‌స్ ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. టీడీపీలో సీనియ‌ర్ నాయకుడు అయిన దాడి వీర‌భ‌ద్ర‌రావు త‌ర్వాత వైసీపీలో చేరారు.  దాడి తన‌యుడు ర‌త్నాక‌ర్ వైసీపీ నుంచి విశాఖ న‌గ‌రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత […]

నంద్యాల‌పై చంద్ర‌బాబుకు తేడా కొడుతుందా..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం చంద్ర‌బాబుకు నంద్యాల‌పై ఎక్క‌డా లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. నంద్యాల‌లో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఇక్క‌డ గెలుపు అంత వీజీ కాద‌ని రిపోర్టులు చెపుతోన్న నేప‌థ్యంలో చంద్రబాబుకు చిరు చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అక్క‌డ కులాల వారీగా నేత‌ల‌ను దింపుతున్నారు. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న చంద్రబాబునాయుడి ఆదేశాలతో నంద్యాలపై నిధులు కుమ్మరిస్తున్నారు. మొన్నటి వరకు నంద్యాల అభివృద్ధికి పెద్దగా నిధులు […]

శమంతకమణి TJ రివ్యూ

సినిమా : శమంతకమణి రివ్యూ రేటింగ్ : 3/5 పంచ్ లై :శమంతకమణి కుర్రాళ్లకు బాగా ఉపయోగపడింది నటీ నటులు: రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది నిర్మాత: V ఆనంద ప్రసాద్ బ్యానర్ : భవ్య క్రియేషన్స్ సంగీతం : మణిశర్మ కథ ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన శ్రీరాం ఆదిత్య ఆ సినిమాతో డైరెక్టర్ గా తన తాను ప్రూవ్ […]