వరుస రైల్వే ప్రమాదాలకు కారణాలేమిటీ…?

ఘోర ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖ గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు కనిపించడంలేదు. దీంతో అమాయక ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో కంటకాపల్లి రైల్వేస్టేషన్ రక్తసిక్తమైంది. బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అలమండ స్టేషన్ కి కూతవేటు దూరంలో రైలు ఆగింది. అంతలోనే ఒక్కసారిగా గుండె పేలిపోయినంత పనైంది. హాహాకారాలు, అరుపులు, […]

స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన…!

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మరింత స్పీడ్ పెంచుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇరుపార్టీల సమన్వయంతో వెయ్యి మందితో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ, జనసేన కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు రంగం […]

అచ్చెన్న ఎందుకిలా.. మరీ ఇలా అయితే ఎలా….?

కింజరాపు అచ్చెన్నాయుడు… రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. మాజీ మంత్రిగా.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గం నుండి వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. అయితే ఆయన తీరు మాత్రం సిక్కోలు జిల్లా పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఇందుకు కారణం ఆయన వ్యవహరిస్తున్న తీరే అంటున్నారు సిక్కోలు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ హవాలో సైతం వరుసగా రెండోసారి టెక్కలి నియోజకవర్గం నుండి విజయం సాధించారు అచ్చెన్న. ఉత్తరాంధ్ర […]

అయ్యన్న – గంటా… ఇదో తెగని పంచాయతీ…!

విశాఖ రాజకీయాల్లో వారిద్దరిదీ సుదర్ఘీమైన ప్రస్థానం, ఒకేపార్టీ నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారు. కేబినెట్ సహచరులుగాను పనిచేశారు. కానీ ఒకరంటే మరొకరికి గిట్టదు. ఇద్దరి మధ్య పరస్పర విమర్శలు, విసుర్లే ఉంటాయి. పార్టీ అధినేత జోక్యంతో మెత్తబడినట్లు కనిపిస్తారు. బాస్ కోసమే చిరునవ్వులు చిందించి, చేతులు కలుపుతారు. కొన్నాళ్లకే మళ్లీ వైరానికి దిగుతూ పాతపాటే పాడుతారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత […]

రంజుగా విశాఖ తూర్పు రాజకీయం…!

విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. హ్యాట్రిక్ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు సృష్టించాలని అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారపార్టీ నేతల భూఅక్రమాలపై పోరాటంతో జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. అధికార పార్టీలోని గ్రూపులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రంగప్రవేశంతో విశాఖ తూర్పు రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయనిర్మలపై వెలగపూడి […]

పవన్ కోసం మెగా ఫ్యామిలీ రెడీ…!

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీ నాయకులను కలుపుకొని బహిరంగ సమావేశాలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ పార్టీ ఎంత ద్రోహం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీ గడప గడపకు అంటుంటే, టీడీపీ బాదుడే బాదుడు అంటోంది. ఇక జనసేన కూడా వారాహి యాత్ర నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి పేరుతో ఎన్నికల ప్రచారం […]

టీడీపీలో చక్రం తిప్పుతున్న బీసీ నేత…!

తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపించని ధీమా వచ్చేసింది అనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ సానుభూతి తమకు ఓట్లు కురిపిస్తుంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. గతంలో గెలుపుపై ఆశలు వదులుకున్న నేతలు సైతం ఈ సారి భారీ మెజారిటీ ఖాయమని కాలర్ ఎగిరేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది నేతలు పార్టీలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంఛార్జులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రాబోయే ఎన్నికల్లో వారికే టికెట్లు కేటాయించడం […]

ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ పోటీ చేస్తారో తెలుసా…?

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి… ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఇందుకు కీలక కారణాలున్నాయి. వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో రాజధాని అమరావతి పరిధిలో గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అసెంబ్లీలో గుండె జగన్.. జగన్ అని కొట్టుకుంటుంది అంటూ మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇసుక ర్యాంపులు, పేకాట శిబిరాల నుంచి ఎంత ఆదాయం వస్తుంది… మనకెంత ఇస్తారు…. అంటూ మాట్లాడిన ఆడియో కాల్ పెద్ద వైరల్ అయ్యింది. […]

ఆ సీటు కోసం వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి ప్రయత్నం…!

గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి బలహీనవర్గాలంటే గిట్టేది కాదనే మాట బలంగా వినిపిస్తోంది. బీసీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ చైర్మన్లకు అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు అందేవికావు. కనీస గౌరవం ఇచ్చే వారు కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించేవారు కాదు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే బలహీనవర్గాల నినాదాన్ని అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా మార్పు రావడానికి కారణం ఏంటి..? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. ఈ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే […]