మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన నియోజకవర్గం ఇదే అంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం కావడం కూడా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో దిగిన లోకేశ్… ఓటమితోనే సరిపెట్టుకున్నారు. అయితే మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తా అంటూ బల్లగుద్ది మరీ […]
Category: AP
ఎలక్షన్ టార్గెట్… దూకుడు పెంచిన చంద్రబాబు…!
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఈసారి గెలవకపోతే… ఇదే తనకు చివరి ఎన్నికలు అనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు వ్యవహారం. ఇప్పటికే 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు 2029లో జరిగే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకని ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా చంద్రబాబు పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఎన్నికల టార్గెట్గా చంద్రబాబు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు […]
పల్నాడు వైసీపీ నేతల్లో స్థాన చలనం తప్పదా…!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి సమీప జిల్లా కావడంతో… ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. అధికార పార్టీలో అయితే సిట్టింగ్ అభ్యర్థుల మార్పు తప్పదనే పుకార్లు సైతం ఇప్పటికే షికార్లు చేస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలోని […]
శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఫుల్ క్లారిటీ…!
రాబోయే ఎన్నికల్లో గెలుపే వైసీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటికే పార్టీ నేతలకు వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో టాప్ ప్లేస్లో ఉన్నది శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం. వరుసగా రెండు సార్లు ఓడిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి […]
ఆ ఇద్దరి మధ్య… పొత్తు ఉన్నట్లా… లేనట్లా…!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే పుకార్లతో పాటు అధికార వైసీపీ నేతలు సైతం అభ్యర్థుల ప్రకటన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తుండటంతో… ముందస్తు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే […]
లోకేశ్ పాదయాత్రలో భారీ మార్పులు… ఎందుకనీ…!?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మొదలైన యువగళం పాదయాత్ర… 6 జిల్లాలు పూర్తి చేసుకుని 7వ జిల్లాలో కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా పాదయాత్ర రూట్ మ్యాప్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు ఒకలా సాగిన పాదయాత్ర… ప్రకాశం జిల్లా నుంచి మారినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు, అనంతపురం, […]
అమ్మకు అగ్నిపరీక్ష.. ఏం చేస్తారో చూడాలి మరి….!
ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిళ కొత్త అధ్యక్షురాలుగా రాబోతున్నారా..? పత్రికలో వచ్చిన కథనం మేరకు ఇదే జరగబోతోంది. అయితే ఇది జరిగే పనేనా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పాలు-నీళ్లలా ఉన్న జగన్-షర్మిళలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిన మాట వాస్తవమే. కానీ ఆమె నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే.. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు కొన్ని పరిణామాలు జరిగాయి… పరిస్థితులు మారాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో […]
మంగళగిరి టూ మంగళగిరి.. ఊహించని మార్పు..!
పాదయాత్ర ఓ నాయకుడిలో ఇంత మార్పు తెస్తుందా..? గతానికి భిన్నంగా మనిషిని పూర్తిగా మార్చేస్తుందా..? నాయకత్వ లక్షణాలను అబ్బేలా చేస్తుందా..? నారా లోకేష్ పాదయాత్ర జరిగిన తీరు.. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. సరిగ్గా 188 రోజుల క్రితం లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 2500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మంగళగిరి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పర్యటనలు.. గడప గడపకు కార్యక్రమాలు ముగించుకుని పాదయాత్రకు వెళ్లిన లోకేష్ మళ్లీ 185 రోజుల తర్వాత […]
ఇదేం ఘోరం గోవిందా..?
అవును పాపం భూమన అనాల్సిందే. ఏ మూహుర్తంలో రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఫిక్స్ అయిందో కానీ.. ఆ సమయం ఆయనకు అంతగా కలిసి వచ్చినట్టు లేదు. తిరుమల కొండపై చిరుత ఓ చిన్నారిని చంపేయడమనే హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. సంఘటన చాలా బాధాకరం. అయితే ఆ తర్వాత జరిగిన ఘటనలు.. తీసుకున్న నిర్ణయాలు.. చేసిన కామెంట్లు ఇప్పుడు భూమనను ట్రోల్స్కు గురి చేయడంతో పాటు.. మొత్తంగా ప్రభుత్వాన్నే డామేజ్ చేస్తున్నాయి. చిన్నారిని చిరుత చంపేసిన […]