ఒకే ఫ్రేమ్ లో అన్నాచెల్లెలు.. అయినా మాటల్లేవ్..

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ.. జగన్ పార్టీ అధ్యక్షుడు, సీఎం.. . తెలంగాణలో వైటీపీ షర్మిల అధ్యక్షురాలు.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు పిల్లలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. అయితే ఈ అన్నాచెల్లెళ్ల మధ్య అభిప్రాయాలు వచ్చాయని ఇటీవల కాలంలో మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలొచ్చాయి. అవి నిజమే అన్నట్లు జగన్, షర్మిల కూడా ప్రవర్తించారు. షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ అన్నాచెల్లెలు […]

అంబానీతో బంధం ఎలా కొనసాగుతోంది..?

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. శుత్రువులు మిత్రులు కావచ్చు.. మిత్రులు శత్రువులు కావచ్చు.. అదేగా రాజకీయం.. ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఇదే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం రిలయన్స్ కంపెనీ వాళ్లే.. అంటూ అప్పట్లో రిలయన్స్ షోరూములపై దాడులు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. జగన్ కూడా అప్పట్లో రిలయన్స్ నే టార్గెట్ చేశారు. అయితే తరువాత ఎన్నికలు రావడం.. జగన్ సీఎం సీటులో కూర్చోవడంతో సమీకరణలు మారిపోయాయి. అంబానీలతో ఇపుడు జగన్ స్నేహ […]

కేటీఆర్.. పాపులర్ పొలిటీషియన్..

కల్వకుంట్ల తారక రామారావు.. సింపుల్ గా కేటీఆర్ సన్నాఫ్ సీఎం కేసీఆర్.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఆయన కేసీఆర్ కుమారుడిగా కాక సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎంత అంటే.. 30 లక్షల మంది (మూడు మిలియన్లు) తనను ఫాలో అయ్యేంత.. కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేవలం గత సంవత్సరం నుంచే 10 లక్షల మంది కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను చూస్తున్నారు. 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో […]

వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయడానికి కొందరిని పుట్టిస్తాడు. వారే కారణజన్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి మహనీయుడు! ప్రభుత్వాల పరిపాలన అనేది ప్రజాసంక్షేమం అనే లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా ఉన్నంతవరకు, ఇతరత్రా సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించనంత వరకు ఎవ్వరేమనుకున్నా ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయేలాగా ఉండాలనేది […]

కేసీఆర్ అలా చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా

తెలుగుదేశం పార్టీలో ఉండి.. అక్కడ ఇమడలేక.. బీజేపీలో చేరి ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఇపుడు కేసీఆర్ కు మద్దతు పలుకుతున్న మోత్కుపల్లి నరసింహులు ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఇటీవల దళిత బంధు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేద దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకంపై విమర్శలు రాకున్నా.. రాష్ట్రమంతా అమలు చేయాలి అనే డిమాండ్ ఊపందుకుంది. దళితులకు […]

ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?

ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు […]

లీడర్స్ ఫ్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ..కమలంలో మరో గ్రూప్‌..

తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్‌ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు. […]

పెరుగుతున్న కేసులు.. కోర్టుల చుట్టూ అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వేల మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా కోర్టుకు వెళుతున్న వారు రోజుకు దాదాపు 450 మంది ఉంటున్నారట. ఇప్పటికి రాష్ట్రానికి సంబంధించిన కేసులు దాదాపు లక్షా 94వేల కేసులు ఉన్నాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర కోర్టుల్లో ఈ కేసులు నడుస్తున్నాయి. 8 వేల కేసుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి […]

మల్లన్నను రామన్న సమర్థిస్తున్నట్లుందే..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వాడిన పదజాలాన్ని మం‍త్రి, టీ కేటీఆర్‌ సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి కేటీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని నేరుగా సమర్థించకుండా దాదాపు సమర్థిస్తున్నట్లే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో కాం‍గ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన […]