సరే అనలేక.. సారీ అనలేక…

తెలంగాణ ముఖ్యమం‍త్రి, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు ఇపుడు పెద్ద చిక్కొచ్చి పడింది. విద్యత్‌ చార్జీలు, బస్సు చార్జీల పెంపు వ్యవహారం కేసీఆర్‌ టేబుల్‌ మీదకు వచ్చింది. రాష్ట్రంలో అనేక రోజులుగా ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. దీంతో ఆయా సంస్థలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చార్జీలు పెంచకపోతే సంస్థల మనుగడ కష్టమవుతుందని ఇప్పటికే అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సు, విద్యుత్‌ చార్జీలు పెంచేవిషయంలో సీఎం […]

ఒకచోట వసూలు.. మరోచోట రద్దు

ఓటీఎస్.. వన్ టైం సెటిల్మెంట్.. ఇటీవల మీడియాలో కనిపిస్తున్న పదం ఇది.. ముఖ్యంగా ఏపీ మీడియాలో ఓటీఎస్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది.. ఏమిటీ ఓటీఎస్ అంటే.. ఏపీ హిసింగ్ బోర్డు నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకొని ఆ తరువాత బకాయిలు లక్షలాది మంది చెల్లించలేదు. అవి అలాగే పేరుకుపోయాయి.. ఇప్పట్లో ఎవరూ చెల్లించే పరిస్తితి కూడా లేదు.. అందుకే ప్రభుత్వం కాస్త డిఫరెంటుగా ఆలోచించి.. తీసుకున్న మొత్తం లబ్ధిదారులు ఎలాగూ కట్టే పరిస్థితి లేదు.. […]

ఎన్టీఆర్ యూనివర్సిటీపై జగన్ కన్ను?

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం.. ప్రముఖ యూనివర్సిటీ..విజయవాడలోని ఈ ప్రముఖ విద్యాసంస్థ నిధులపై ప్రభుత్వ కన్ను పడింది.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమస్య ఏర్పడటంతో నిధి సమీకరణలో ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వర్సిటీకి చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వర్సిటీ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.250 కోట్ల నిధులున్నాయి. అవన్నీ ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి […]

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు యాత్ర మళ్లీ మొదలు!

తెలంగాణలో అధికారమే లక్ష్యగా పార్టీని ప్రారంభించి రాజకీయ కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ ను విమర్శించడంలో ముందున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ముందునుంచీ పోరాడుతూ వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగాలు రాక నిరాశచెంది ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు..ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత కుటుంబాల వద్దే దీక్ష చేస్తున్నారు. ప్రతి మంగళవారం వారిళ్ల వద్దే సర్కారుకు వ్యతిరేకంగా.. ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్ తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. […]

అసలే మద్య నిషేధం.. ఆపై అసెంబ్లీ ఆవరణలో మందు సీసాలు..

మద్యం అమ్మకాలు.. ప్రభుత్వాలకు అతి పెద్ద ఆదాయ వనరు..ఈ లాభాన్ని నమ్ముకొనే కొన్ని రాష్ట్రాలు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కొత్త వైన్ షాపులు కూడా ఈ సంవత్సరం వస్తున్నాయి.. ఇటీవలే టెండర్లు కూడా పూర్తయ్యాయి.. నేడో, రేపు కొత్త మద్యం దుకాణలు ఏర్పాటు కాబోతున్నాయి.. వీటి సంగతి పక్కన పెడితే బిహార్ లో ఇపుడు సీఎం నితీష్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. నితీష్ కుమార్ ఆధ్వర్యంలో […]

కేసీఆర్ వైపు చూపిస్తున్న కిషన్ వేలు

నేను ఆయనను కలవాలని చాలా సార్లు ప్రయత్నించా.. అయినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. నేను కేంద్ర మంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదేమో.. అందుకే కలవడానికి అవకాశం ఇవ్వలేదేమో.. అని కేంద్ర కేబినెట్ మంత్రి, టీ.బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రైతులకేమో గానీ పార్టీల మధ్య వేడిపుట్టింది. ఓ వైపు రైతులు ప్రాణాలు కోల్పోతుంటే.. కారు, కమలం పార్టీలు మాత్రం రాజకీయ గొడవలకు దిగుతున్నారు. […]

ఒకే సమావేశంలో కారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు

నరేంద్రమోదీ కేంద్రంలో అధికారం చేపట్టి ఏడేళ్లయింది. కమలం పార్టీ జాతీయస్థాయిలో ప్రధాన పార్టీగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీని పక్కకు తోసి నరేంద్రమోదీ పార్టీని విజయంవైపు నడిపించాడు. ఇది ఓకే.. ఇక తెలంగాణలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా స్థానికంగా బీజేపీ నేతలతో విభేదించినా కేంద్రంలో మాత్రం మోదీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు కొనసాగించింది. ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు పార్లమెంటులో మద్దతు తెలిపింది. మద్దతు తెలపలేని పక్షంలో సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు […]

‘మమత’కు చోటులేదిక్కడ?

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. తాననుకున్నది కచ్చితంగా చేసే మనస్తత్వం..అతి సాధారణమైన జీవితం.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా ఆమె వెరీ సింపుల్..రాజకీయంగా ఎవ్వరితోనైనా ఢీ అంటే ఢీ అంటారు.. అవతల మోదీ ఉన్నా.. సోనియా ఉన్నా.. డోంట్ కేర్.. ఆమే మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన రాజకీయ యోధురాలు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీని […]

తిరుమల దర్శనాన్ని వాయిదా వేసుకోండి.. టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు తమ దర్శనాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల రెండో కనుమదారిలో ఇవాళ ఉదయం కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం రెండో కనుమదారిలో కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఘాట్ రోడ్డుపై పడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు భారీగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రాళ్లు పడ్డ ప్రాంతంలో వాహనాలు ఏమీ […]