టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా.. తెలుగు సినిమా ఖ్యాతిని ఏ రేంజ్లో పెంచిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, రానా దగ్గుబాటి ,అనుష్క, తమన్నా భాటియా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజై 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న క్రమంలోనే.. మేకర్స్ ఫిలిం రెండు భాగాలను బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్ రీ రిలీజ్ చేయనున్నారు.
కానీ.. ఇందులో మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రెండు భాగాలను ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్తో విలీనం చేయనున్నారు. అక్టోబర్ 31, 2025 న స్పెషల్ మూవీ గా పెద్ద స్క్రీన్పై రిలీజ్ చేయనున్నారు. తాజాగా.. ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు టీం అఫీషియల్గా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ మీడియాలో సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేయడం విశేషం.
ఈ సినిమా రిలీజై.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అడవి శేష్, నాజర్, సుబ్బరాజు, సత్యరాజ్ కీలక పాత్రలో మెరుసారు. ఆర్క మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశారు. ఇక సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలిసిందే.