టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి చివరగా తెరకెక్కించిన తండేల్తో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాను అంతకుమించి పోయే రేంజ్ లో ప్లాన్ చేశాడట. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూసర్గా ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమాను చరిత్ర, భక్తి, మోడల్ టెక్నాలజీ కలయికతో రూపొందనుందని తెలుస్తుంది. భారీ లెవెల్లో త్రీడీ యానిమేషన్ టెక్నాలజీతో ఈ సినిమా రూపొందనుందట. ఇక వాయుపుత్ర టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.
హనుమంతుడి కాలాతీత కథను గొప్ప సినిమాగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక.. ఈ సినిమా 2026 దసరా కానుకగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ప్రాజెక్ట్ అఫీషియల్గా ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. హనుమంతుడు కొండపై నిలబడి దహనం అవుతున్న లంకను చూస్తున్న ఒక పవర్ఫుల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఇది కేవలం సినిమా కాదు.. థియేటర్స్ను పవిత్రమైన దేవాలయాలుగా మార్చేసే దృశ్యంగా మారనుందని.. మునుపెన్నడూ లేని రేంజ్లో భక్తిపార్వస్యంలో ముంచేసేలా.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా.. ఈ సినిమా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాయుపుత్ర ఒక సినిమాటిక్ మైల్డ్ స్టోన్గా ఆడియన్స్ను పలకరించనుంది. ఇక చందు ముండేటి డైరెక్షన్లో ఇండియన్ ఇండస్ట్రీకి అర్థంపట్టేలా ఈ సినిమాను సిద్ధం చేయనున్నారు. హార్ట్ టచింగ్ కథాంశంతో.. అద్భుతమైన త్రీడి యానిమేషన్ విజువల్స్తో కలిపి ఆడియన్స్ను పలకరించనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రిలీజ్ చేయనున్నారు.