తాజాగా మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా సక్సెస్ మీట్లో మంచు మనోజ్.. మూవీస్ రీ రిలీజ్ ట్రెండ్పై మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వాస్తవానికి భైరవం సినిమా కంటే.. తాజాగా రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఖలేజా కు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా నుంచి మనోజ్కు ఇదే ప్రశ్న ఎదురు కాగా.. రీ రిలీజ్ సినిమాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే విషయంపై మనోజ్ రియాక్ట్ అయ్యారు.
ఇప్పటికే ఐపిఎల్ అనే క్రికెట్ ఈవెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని.. అయితే పాత సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేయడం సరైన విషయం కాదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఎందుకంటే.. పెద్ద సినిమాలన్నీ పండుగ సీజన్లో బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. ఇలాంటి సాధారణ రోజుల్లోనే కొత్త సినిమాలు రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కూడా రీ రిలీజ్ సినిమాలు వస్తే.. అవి కొత్త సినిమాలను దెబ్బతీస్తాయంటూ.. తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇది కనీసం వీక్ డేస్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది. సోమవారం రిలీజ్ చేస్తే.. సినిమాపై శుక్రవారం కాస్త ప్రభావం తగ్గుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఓ తెలుగు సినిమా.. మరో తెలుగు సినిమాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంపేయడం అనే పదమే సరైనదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ పదం.. తప్పనిసరిగా వాడాల్సి వస్తుందని మనోజ్ వివరించాడు. బైరం సినిమా నిర్మాత రాధ మోహన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రీ రిలీజ్ సినిమాల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశాడు.