టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత ఠక్కును వినిపించేది అనిల్ రావిపూడి. ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుంటూ వచ్చాడు. మొదటి సినిమా పటాస్ నుంచి చివరిగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం వరకు బ్యాక్ టు బ్యాక్ హీట్స్ అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే తిరుగులేని దర్శకుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక.. ప్రస్తుతం అనీల్.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార , వెంకటేష్ మెరవనున్నారు.
తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ ప్రెస్ మీట్ తో రివీల్ చేశాడు అనిల్ రావిపూడి. జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇదే ప్రమోషన్స్లో భాగంగా.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అంతేకాదు.. తన కెరీర్ ప్రారంభం నుంచి వస్తున్న క్రింజ్ డైరెక్టర్ అనే కామెంట్స్ పై ఆయన రియాక్ట్ అయ్యాడు. నన్ను కొందరు క్రింజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ క్రింజ్ అనే పదం నాతో పాటు.. మొదటి నుంచి ఇప్పటివరకు ప్రయాణిస్తుంది. నేను సంక్రాంతికి వస్తున్నాం లాంటి మరో 10 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన కూడా ఇదే క్రింజ్ కామెంట్స్ వినిపిస్తాయి.
కానీ.. అది కేవలం 10 శాతం మంది నుంచి మాత్రమే.. మిగతా 90 శాతం మంది నా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. సంతోషంగా టికెట్లు కొంటున్నారు. అలాంటప్పుడు ఆ 10 శాతం మంది చేసే క్రింజ్ కామెంట్స్లో ఎందుకు సీరియస్గా తీసుకోవాలి. అంతేకాదు.. నా సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. నిర్మాతలు వస్తువులతో సాటిస్ఫైడ్గా ఉన్నారు. 90 శాతం మందికి నా సినిమాల నుంచి నెగటివ్ స్పందన వస్తే.. నేను బాధపడాలి. ఆలోచనలో పడాలి. అంతేకానీ.. 10 శాతం మంది గురించి నేను పట్టించుకోవాల్సిన పనిలేదు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.



