అఖండ 2 ప్రొడ్యూసర్లకు బిగ్ రిలీఫ్.. సింగిల్ బెంచ్ ఆర్డర్స్ క్యాన్సిల్..!

బాలకృష్ణ, బోయపాటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 నేడు.. పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా ఆడియన్స్‌ను పలకరించింది. ఇక.. ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. మేక‌ర్స్‌కు షాక్ పై షాక్ తగులుతూనే ఉంది. మొదట.. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అనుకుంటే ఫైనాన్స్ ఇష్యులతో సినిమా వాయిదా పడింది. ఇక తర్వాత డిసెంబర్ 12న సినిమా రిలీజ్ కు ఫిక్స్ చేసుకున్నా కూడా.. తెలంగాణ కోర్టులో టికెట్ రేట్ల పెంపు పై పిటిషన్ దాఖలు అయింది. ఈ క్రమంలోనే తెలంగాణ కోర్టు సైతం టికెట్ హైక్‌ క్యాన్సిల్ చేయమంటూ జీవోన్ పాస్ చేసి మేకర్స్‌కు షాక్ ఇచ్చింది.

అయితే.. ఈ వివాదాలు అన్నింటినీ దాటుకుని సినిమా నేడు రిలీజై ఆడియన్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. ఇలాంటి క్రమంలో అఖండ 2 మేకర్స్‌కు మరో షాక్ ఇవ్వాలని కొందరు ప్రయత్నించారు. సినిమా ప్రీమియర్ టికెట్ ధరల పెంపు విషయంలో జీవో పాస్ చేసిన ప్రీమియర్ సాగలేదు అంటూ సింగిల్ బెంచ్ పెట్టేషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ జీవోను రద్దు చేస్తూ.. డివోషనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అఖండ 2 మేకర్స్ కు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. తమ వాదనలు వినకుండానే సింగిల్ బెంచ్.. ధరల పెంపు జీవోను సస్పెండ్ చేసిందని మూవీ నిర్మాణ సంస్థ 14 రీల్స్.. డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించారు.

సింగిల్ బెంచ్ అందరి వాదనలు వినాలని మళ్ళీ అక్కడే విచారణ ప్రారంభించాలని ఆదేశించింది. అసలు మేటర్ ఏంటంటే.. గురువారం ప్రీమియర్ షోతో పాటు.. టికెట్ ధరలను మూడు రోజుల వరకు పెంచుకునేందుకు తెలంగాణ గవర్నమెంట్ జివో పాస్ చేయ‌గా.. టికెట్ రేట్స్ హూక్‌పై న్యాయ‌వాది శ్రీ‌నివాస్ తెలంగాణ కోర్ట్‌లో పిటిషన్ దాకలు చేశాడు. దీంతో విచారణ జరిపిన కోర్ట్‌.. సింగల్ బెంచ్ పిటీష‌న్‌తో ప్రీమియర్ టికెట్లు ధర పెంపును రద్దు చేసింది. అయినప్న‌టికి ప్రీమియర్ కొనసాగాయి అంటూ మళ్ళీ కోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో.. 14 రీల్స్‌ సంస్థ ఆపిల్‌కి వెళ్లి.. తన వాదనను వినిపించింది. ఇరు వ‌ర్గాల వాదనలు విన్న కోర్ట్‌.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను క్యాన్సిల్ చేసి.. అఖండ 2 ప్రొడ్యూసర్లకు బిగ్‌ రిలీఫ్ ఇచ్చింది.