టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ 9 కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. రసవత్తరంగా కొనసాగుతున్న ఈ షో.. తొమ్మిదవ వారం నామినేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈసారి.. తనుజ, కళ్యాణ్, సుమన్, సంజన, భరణి, రాము, సాయి శ్రీనివాస్ ఇలా ఏకంగా ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళలో.. ఎవరు డేంజర్ జోన్ లో ఉండిపోతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారు తెలుసుకోవాలని ఆసక్తి ఆడియన్స్లో మొదలైపోయింది. కాగా.. తనుజ ఎప్పటిలానే 32 శాతం ఓటింగ్తో మొదటి స్థానంలో ఉండగా.. కళ్యాణ్ పండ్రాల 21% ఓటింగ్ తో రెండవ స్థానంలో, సుమన్ శెట్టి 14% ఓటింగ్ తో 3వ స్థానంలో, భరణి 11% ఓటింగ్ తో 4వ స్థానంలో, సంజన గల్రాని 10% ఓటింగ్ తో 5వ స్థానంలో.. రామ్ రాథోడ్ 8% ఓటింగ్ తో 6వ స్థానంలో నిలిచారు.

చివరిగా నాలుగు శాతం ఓటింగ్ తో సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్ కు వెళ్ళాడు. దీంతో సాయి శ్రీనివాస ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు అంత సిద్ధమైందని అంటున్నారు. సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్కు ప్రధాన కారణం అతనికి తక్కువ ఓటింగ్ రావడం. సాయి శ్రీనివాస్ హౌస్లోకి వెళ్లిన తర్వాత మొదటిసారి నామినేషన్స్ లోకి అడుగుపెట్టాడు. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం.. పిఆర్ నెట్వర్క్ లేకపోవడంతో ఆయనకు ఓటింగ్ కూడా అంతగా కనిపించడం లేదు. గత వారమే నామినేషన్ లో రావాల్సి ఉండగా.. తన దగ్గర ఉన్న స్పెషల్ పవర్ తో తనని తాను సేవ్ చేసుకున్నాడు సాయి.
కాగా.. ఇతనిపై పెద్దగా కంప్లైంట్స్ కూడా లేవు.. ఉన్నంతవరకు ఫెయిర్ గా ఆడుతున్న.. అడ్డమైన వాదనలకు దిగకుండా.. ఫుటేజ్ కోసం కక్కుర్తి పడకుండా.. హానెస్ట్ గేమ్ ను ప్లే చేస్తున్నా.. అదే ఇప్పుడు ఆయనకు డేంజర్గా మారిందట. ఉన్న విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్లు చిబులాడు. అలా తనుజను ఈ వారం నామినేట్ చేశాడు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజ అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తనూజను నామినేట్ చేయడం కూడా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వడనాకి ఓ కారణం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

