టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. శ్రీలీల ప్రస్తుతం.. వరుస సినిమాలతో మళ్ళీ ట్రైండింగ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత.. ఈ అమ్మడు వరుస సినిమాలో బిజీగా మారింది. ప్రస్తుతం మాస్ మహారాజు రవితేజ హీరోగా.. మాస్ జాతర సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. అక్టోబర్ 31వ వరల్డ్ వైడ్గా ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. శ్రీలీల వరుస ఇంటర్వ్యూలలో సందడి చేస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటుంది.

ఇందులో భాగంగా.. శ్రీ లీల మాట్లాడుతూ.. రవితేజతో ఇప్పటికే ఒక సినిమా చేశా.. ఇది నాకు సెకండ్ మూవీ. ఈ సినిమాకు ఆ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంది అంటూ వివరించింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను పవన్ గారితో చేసే సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. ఈ సినిమా అచ్చం అలానే అనిపిస్తుంది. అందరికీ కావాల్సిన బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందులో ఉంది.

గతంలో ఎప్పుడు చూడని రేంజ్ లో ఈ సినిమా ఉంటుందంటూ సినిమా పై హిప్ డబ్బులు చేసింది. ప్రస్తుతం శ్రీ లీల చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అది చూసిన ఫ్యాన్స్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసుకుంటున్నారు. మరి.. ఈ రెండు సినిమాలు శ్రీలీలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో.. ఏ రేంజ్లో ఇబేజ్ను క్రియేట్ చేస్తాయో చూడాలి.

