స్పిరిట్ లో రవితేజ , త్రివిక్రమ్ వారసులా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ కోసం ఆడియ‌న్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయ‌డం ఖాయమని ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న ప్రభాస్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా.. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

కేవలం ఒక్క ఆడియో టీజర్‌తోనే ఈ సినిమాపై జ‌నంలో హైప్‌ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. అయితే.. ఈ సినిమాను సందీప్ వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నాడు. ఈ క్ర‌మంలోనే అదిరిపోయే ప్లానింగ్ చేశాడంటూ ఓ టాక్ వినిపిస్తుంది. సినిమాలో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో రవితేజ, మాట‌ల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ వారసులను కూడా వర్క్ ఈ ప్రాజెక్ట్ కోసం వాడ‌నున్ఆడ‌ట‌. రవితేజ తనయుడు మహాధన్ భూపతిరాజు, త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ ‘స్పిరిట్’ మూవీలో భాగం అవుతున్నార‌ట‌.

అయితే ఇక్క‌డ అస‌లు ట్విస్ట్ ఏంటంటే.. వీళ్ళు నటులుగా కాదు.. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా ప‌ని చేస్తున్నారు. దీంతో.. సందీప్ దగ్గ‌ర‌ టెక్నికల్ మెలకువలు నేర్చుకునేందుకు ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ ‘స్పిరిట్’లో భాడం కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక.. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు.