అక్కినేని నాగచైతన్య, సమంతల ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్ధరి లైఫ్ తెరిచిన పుస్తకమే. ఇక.. టాలీవుడ్లో ఒకప్పుడు బెస్ట్ పేయిర్గా.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. కానీ.. వీళ్ళ మధ్య విభేదాలతో విడాకులు తీసుకొని ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ ను వాళ్లు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. కాగా ఇద్దరు విడాకుల విషయంలో ఎవరి అభిమానులు వాళ్లుగా రెండు వర్గాలు విడిపోయి.. ఇప్పటికీ సమంతది తప్పంటూ, నాగచైతన్యదే తప్పంటూ.. ఎవరి వర్షన్లో వాళ్ళు కథలు అల్లి సోషల్ మీడియాలో వాటిని ట్రెండ్ చేస్తూ వస్తున్నారు.
నాగచైతన్య వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉంటే సమంత తట్టుకోలేక ఆయనకు విడాకులు ఇచ్చిందంటూ ఓ పక్క.. నటనకు దూరంగా ఉండాలని మీ నాగచైతన్య హెచ్చరించిన సమంత వినకుండా సినిమాలకు గ్రీన్ సింగిల్ ఇవ్వడంతోనే చైతన్యనే సమంతకు విడాకులు ఇచ్చారంటూ మరోపక్క వాదనలు వినిపించాయి. ఇక.. ఈ జంట విడాకుల తర్వాత నేరుగా ఒక్క సందర్భంలో కూడా కలవలేదు. ఇదిలా ఉంటే.. సమంత, నాగచైతన్యాలు బాండ్ గురించి తాజాగా ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్వీ. నాగనాథ్ ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
డివోర్స్ తర్వాత సమంత సింపతి కోసం చాలా ప్రయత్నాలు చేసింది.. తన సినిమా ప్రమోషన్స్లో డివోర్స్ విషయంలో తన తప్పు ఏం లేదని.. తను మోసపోయినట్లు నటించిందని.. ఆడియన్స్లో సింపతి కోసం అదంతా చేసిందంటూ నాగనాథ్ కామెంట్స్ చేశాడు. దొంగ ఏడుపులు ఏడ్చి.. చైతన్యను సమంత వదిలేసిందని ఆయన షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఈ విషయంలో నాగచైతన్య చాలా బాధపడినట్లు సైకాలజీస్ట్ నాగ్నాథ్ వివరించారు. సమంతతో పోలిస్తే.. నాగచైతన్య వంద శాతం బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక గతంలోనే చైతన్య పెళ్లికి ఒప్పుకోలేదని.. అయినా అతని బెదిరించి మరి వివాహం చేసుకుంది. చివరకు విడాకులు తీసుకుందంటూ చెప్పుకొచ్చాడు.