సినీ ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఇప్పటికే డ్యూయల్ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి స్టార్ సెలబ్రెటీస్.. త్రిబుల్ రోల్స్లో అంతకంటే ఎక్కువ పాత్రలో నటించడం మాత్రం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. అయినా కొంతమంది నటీనటులు.. రెండు పాత్రల కంటే ఎక్కువ పాత్రలోను నటించి సత్తా చాటుకున్నారు. ఆ లిస్టులో మొదట వినిపించేది కమల్ హాసన్ పేరే. మైఖేల్ మదన్ కామరాజన్ సినిమాలో నాలుగు పాత్రలు పోషించి మెప్పించిన కమల్ హాసన్.. దశావతారం సినిమాలో ఏకంగా 10 పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కమల్ నటించిన ప్రతి ఒక్క పాత్ర ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది.
తన నటనతో ఆడియన్స్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న కమల్.. ప్రస్తుతం లోకనాయకుడిగా.. తిరుగులేని దూసుకుపోతున్నాడు. కాగా.. ఇప్పుడు కమల్ హాసన్ రికార్డును చిత్తుచిత్తుగా బ్రేక్ చేసి.. ఏకంగా 45 పాత్రలను పోషించి.. గిన్నిస్ రికార్డును క్రియేట్ చేశాడు ఓ మలయాళ నట్టుడు. అతను మరెవరు కాదు జాన్ జార్జ్. 2018.. మార్చ్ 9న రిలీజ్ అయిన అరుణ్ఎన్జెన్ సినిమాలో.. ఆయన ఏకంగా 45 పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఉన్నికృష్ణన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. రిలీజ్ టైంలో ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకోకున్నా.. తాజాగా గిన్నిస్ బుక్లో మాత్రం చోటు దక్కించుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇందులో జాన్జార్జ్.. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, డివిన్సీ, జీసస్ క్రిస్ట్ లాంటి 45 పాపులర్ పాత్రల్లో నటించాడు. ప్రతి పాత్రలోనూ పరిధికి తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఈ సినిమా అసలు స్టోరీ గ్లోబల్ మాన్ అనే వ్యక్తి కథ. ఇది ఓ వ్యక్తి తనను తాను తెలుసుకోవాలని ప్రపంచమంతా చుట్టి వస్తున్న పాత్రలో.. జాన్ జార్జ్ హీరోగా నటించిన ప్రతి పాత్ర ద్వారా.. నేనెవరో.. నా నిజమైన గుర్తింపు ఏంటి.. అని తనని తాను ప్రశ్నించుకుంటాడు. ఇక ఈ సినిమా తర్వాత జాన్ జార్జ్కు గిన్నిస్ రికార్డు రావడమే కాదు.. ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఆయన సాదించిన ఈ రికార్డ్ను ఇప్పటికీ ఎవరు బ్రేక్ చేయలేకపోయారు.