టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తాజాగా తాను రూపొందించనున్న ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో స్టార్ హీరోయిన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్ లో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా శనివారం ఆయన చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్గా మారుతుంది. తాను దర్శకత్వం వహించిన మొదటి హిందీ మూవీ కబీర్ సింగ్ రిలీజై ఆరు ఏళ్ళు అయిన విషయాన్ని ఎక్స్ వైదికగా షేర్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా.. హీరో షాహిద్ కపూర్ లేకుండా కియారా అద్వానీ మాత్రమే ఉన్న పోస్టర్ను షేర్ చేసుకుంటూ.. సినీ ఆడియన్స్కు ధన్యవాదాలు అంటూ తెలియజేశాడు.
కేవలం కియారా ఫోటోలు మాత్రమే షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల సందీప్ రెడ్డి వంగాకు ఒక స్టార్ హీరోయిన్ తో వివాదం నెట్టింట తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో కావాలని కియారాను మాత్రమే ప్రశంసించేందుకు ఆయన ఇలాంటి పోస్ట్ షేర్ చేసి ఉంటాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తీసుకోవాలని ఫిక్స్ అయిన సందీప్.. ఈ మేరకు తాను ఓ హీరోయిన్తో కథ గురించి చెప్పానని.. పనిగంటల విషయంలో అభిప్రాయ బేధాలు రావడం వల్ల ఈ ప్రాజెక్టును ఆమె రిజెక్ట్ చేసిందంటూ.. ఈ క్రమంలోనే ఆమె పిఆర్ టీం నేను చెప్పిన స్టోరీని లీక్ చేసే ప్రయత్నాలు చేశారని షాకింగ్ ఆరోపణలు చేశాడు.
నేను ఓ స్టార్ హీరోయిన్ కి స్టోరి చెప్పా.. 100% నమ్మకంతో ఆమెకు మొత్తం కథను వివరించా. దర్శకులు.. నటినటులకు ఎవరికైనా కథ వినిపిస్తున్నారంటే అనధికార నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. దాని ప్రకారం.. స్టోరీని ఎవరికీ చెప్పకూడదు. కానీ.. స్టార్ హీరోయిన్ మాత్రం ఒప్పందాన్ని బ్రేక్ చేసి.. స్టోరీని మొత్తం లీక్ చేసే ప్రయత్నం చేస్తుందంటూ పోస్ట్ను పంచుకున్నాడు. అయితే.. ఆ స్టార్ హీరోయిన్ మీరెవరో కాదని దీపిక పదుకొనేను ఉద్దేశించి సందీప్ ఈ పోస్ట్ ని షేర్ చేశాడంటూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచి న్యూస్ వైరల్గా మారుతుంది. ప్రస్తుతం మదర్హుడ్ ను ఎంజాయ్ చేస్తున్న దీపిక సినిమాలో నటించేందుకు ఎనిమిది గంటల షిఫ్ట్ కావాలని కోరిందట. అంతేకాదు.. రూ.25 కోట్లు రెమ్యనరేషన్ డిమాండ్ చేయడంతో.. వారి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తేయని.. ఈ క్రమంలోనే అమ్మే ఆ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.