లోకనాయకుడు కమలహాసన్.. తాజాగా నటించిన మూవీ థగ్ లైఫ్.. త్వరలోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రాండ్ లెవెల్లో ప్రమోషన్స్ను ప్రారంభించి సందడి చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగానే.. తాజాగా చెన్నైలో జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకల్లో కమలహాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో దుమారం రేపయో తెలిసిందే. తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల వల్ల కూడా.. ఈ సినిమాలు కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా హీరోగా నటిస్తూ నిర్మాతగా వ్యవహరించిన కమల్ హాసన్.. హైకోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే.. ఈ సినిమా ప్రేక్షకులకు మాత్రం కాస్త కూడా తగ్గలేదు. నాయకుడు సినిమా తర్వాత 38 ఏళ్ల గ్యాప్తో కబల్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో.. ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లెవెల్ లో ఉన్నాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. మొదటి రోజు చూడడానికి ఎంతో మంది సినీ ప్రియులు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినా క్షణాల్లోనే హార్ట్ కేకుల అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలోనే జోరు చూస్తుంటే ఏడాదిలో ఇంతవరకు వచ్చిన సినిమాల కంటే.. థగ్ లైఫ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ను తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, నటినటుల రెమ్యునరేషన్ వివరాలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించగా.. ఈ సినిమా కోసం కమల్ మణిరత్నం స్పెషల్ రెమ్యనరేషన్ తీసుకోలేదట. సినిమా రిలీజ్ తర్వాత.. లాభాల్లో వాటా పంచుకొనున్నారని సమాచారం. ఇక శంభు రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. త్రిష రూ.12 కోట్ల ఛార్జ్ చేసిందని తెలుస్తుంది. ఇక గతంలో త్రిష నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కంటే మూడింతలు ఎక్కువగా ఈ సినిమాకు ఛార్జ్ చేసిందట. అలాగే.. ఇందులో కీలక పాత్రలో పోషించిన జోజు జార్జ్, అశోక్ సెవన్, అభిరామి కూడా భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. ఇక గ్యాంగ్ స్టర్ థ్రిలర్గా రూపొందించిన ఈ సినిమా.. ఈ గురువారం ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ను శ్రేష్ట మూవీస్ ద్వారా.. సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు.