కృష్ణంరాజు ప్రధాన పాత్రలో.. బాపు డైరెక్షన్లో రూపొందిన క్లాసిక్ మూవీ భక్తకన్నప్ప అందరికీ తుండే ఉంటుంది. దాదాపు సినిమా రిలీజ్ 50 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు కీలకపాత్రలో కన్నప్ప సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కృష్ణంరాజు భక్తకన్నప్పకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్గ మారుతున్నాయి. ఈ సినిమా షూట్ ఎలా జరిగింది.. ఏం జరిగిందని అంశాలు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాంఘిక కథలు వెండి ధరపై కళకళలాడుతున్న నేపథ్యంలో.. అప్పుడప్పుడు మైథాలజికల్, భక్తిరస సినిమాలు వచ్చిన.. అయితే అప్పటి యూత్ కు వాటిపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. ఇదే కృష్ణంరాజు మదిలో ప్రశ్నగా మారింది.
మామూలు సినిమాలకు యూత్ ఎలా వస్తున్నారు.. మైథాలజీ సినిమాలకు సైతం ముసలి వాళ్ళతో పాటు.. యూత్ ని కూడా అలా రప్పించాలని ఆలోచనలో పడ్డారట కృష్ణంరాజు. ఈ క్రమంలోనే అప్పటివరకు తెలుగులో ఎవరు టచ్ చేయండి సబ్జెక్టులు ఎంచుకున్నారు. అదే టైంలో కన్నడలో రాజ్ కుమార్ కన్నప్ప తీయాలని భావించాడు. ఇక అప్పట్లో సీరియస్ రోల్కు కృష్ణంరాజు కేరాఫ్ అడ్రస్. అలాంటి ఆయన భక్త రస సినిమాల్లో నటించడం అందరికీ షాక్ ను కలిగించింది. ఇక కృష్ణంరాజు డైరెక్టర్ బాపు దగ్గరకు వెళ్లి.. భక్త కన్నప్ప స్టోరీ గురించి చెప్పారు. అంతకు ముందు తయారు చేసిన స్క్రిప్ట్ను ఆయనకు ఇచ్చి చూడమనగా.. ఆయన స్క్రిప్ట్లో కొన్ని మార్పులు అవసరమని సూచించి ఆ బాధ్యతలను రచయిత ముళ్ళపూడి వెంకటరమణకు అప్పగించారట.
ఇక అప్పటికే అనుకున్న కొన్ని సీన్లకు మరింత ఎమోషన్, ఇంట్రెస్టింగ్ సీన్స్ ను అటాచ్ చేసి కొత్త స్క్రిప్ట్ను రెడీ చేశాడట రమణ. తమ సంస్థ తీసే మొదటి పౌరాణిక మూవీ కావడంతో.. పూర్తి అవుట్ డోర్లో భారీ ఎత్తున కృష్ణంరాజు సినిమాలు నిర్మించాలని భావించాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతంలో ఈ షూటింగ్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాట్లు చేయడానికి రెండు నెలల సమయం పట్టిందట. ఇక తిన్నడు పెరిగిన గూడెం, మల్లన్న మల్ల యుద్ధం, అమ్మవారి విగ్రహ ప్రాంగణం, తిన్నాడు నివసించే కుటీరం, దేవాలయం నిర్మించడానికి మద్రాస్ నుంచి టీంను దింపారు. అప్పట్లో ఏం కావాలన్నా బెజవాడ పరిగెత్తాల్సిన పరిస్థితి. రోజు బెజవాడ నుంచి బుట్టాయిగూడెంకి కార్లు తెగ తిరిగేవి. ఏ ఒక్క వస్తువు దొరక్కపోయినా.. అక్కడే షూటింగ్ ఆగిపోతుంది.
దాదాపు 70, 80 మంది కాలక్షేపం చేయాల్సి వచ్చే పరిస్థితి. దీన్ని నివారించడానికి బుట్టాయిగూడెం అని తాత్కాలిక స్టూడియోగా మార్చేశారు. అక్కడే కార్పెంటర్, ట్రైలర్, ఇతర సెట్ డిజైనర్స్ తమకు కావాల్సిన వస్తువులన్నీ ముందే తెచ్చేసి సిద్ధంగా ఉంచేవారు. బుట్టాయిగూడెం నుంచి అడవి షూటింగ్ జరిగే ప్రాంతం 15 మైళ్ళ దూరం ఉండేది నటినట్టులంతా రోజు అడవికి వెళ్లేవారు. సరిగ్గా రోడ్డు మార్గం కూడా లేని అక్కడికి వెళ్లాలంటే జీపులు తప్ప.. మరే ఇతర వాహనం వెళ్లిన ఎక్కడో చోట ఇరుక్కుపోయే పరిస్థితి. షూటింగ్ జరిగినన్ని రోజులు అడవిలో వెళ్లే 15 మైళ్లలో ఎక్కడో చోట మరమ్మతులు చేస్తూనే ఉండేవారు. ఇక 500 కు పైగా ఉన్న ఆ యూనిట్ సభ్యులంతా 70 రోజులు పాటు ఏకధాటిగా అక్కడే షూట్ను జరిపారు.
వారంలో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసి.. ఆదివారం అందరూ హాలిడే తీసుకునేవారు. ఆ రోజంతా విందులు, వినోదాలతో యూనిట్ సంతోషంగా గడిపి.. మర్నాడు ఉదయాన్నే ఉత్సాహంగా షూటింగ్కు బయలుదేరేవారు. షూట్ జరిగినన్ని రోజులు పెళ్లి భోజనాన్ని తలపించేలా రకరకాల వంటలతో యూనిట్ సభ్యులకు కృష్ణంరాజు చక్కటి విందు సౌకర్యాలను అందించారట. ఈ క్రమంలోనే ఇష్యూ జరిగినన్ని రోజులు కనీసం యూనిట్ సభ్యులకు ఇల్లే గుర్తుకు రాలేదట. అయితే.. తిన్నడు అసలు కథ జరిగిన శ్రీకాళహస్తిలో సినిమాను తీయకుండా గోదావరి జిల్లాలో తీయడానికి ప్రధాన కారణం. తిన్నడి కాలానికి 70వ దశకంలో శ్రీకాళహస్తికి వచ్చిన మార్పులే నాటి వాతావరణం కాళహస్తిలో తీసుకురావడం సాధ్యం కాని పని.
ఈ క్రమంలోనే పట్టిసం గుడి ఆలయ పరిసరాలు.. గోదావరి దృశ్యాలు కాళహస్తి చుట్టుపక్కల ప్రాంతాలను తలపించేలా ఉండడంతో.. గుడి బయట సన్నివేశాలను మొత్తం అక్కడ అడవిలోనే తీసి ప్రధాన ఘట్టాలు కాళహస్తిలో రూపొందించారు. ఇక.. ఈ సినిమా అసలు రికార్డ్ అప్పట్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. అప్పట్లో భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఎన్టీఆర్వే. ఆయనతో సినిమా తీయడానికి రూ.14 నుంచి 16 లక్షలు ఖర్చు చేసే వాళ్ళు. కానీ.. కన్నప్ప కోసం కృష్ణంరాజు ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు చేసే సినిమాలు తీశారు. రాజుగారు ఇబ్బంది పడతారని స్నేహితులు ఎంత చెప్పినా.. కృష్ణంరాజు వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను నిర్మించాడు. 1976 లో రిలీజ్ అయిన సినిమాతో కథ విజయాన్ని అందుకుంది. నటుడుగా, నిర్మాతగా మంచి ఇమేజ్ను తెచ్చిపెట్టింది.