హీరో శ్రీరామ్ అరెస్ట్.. రిమాండ్ లో సెన్సేషనల్ విషయాలు రివీల్..!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన డ్ర‌గ్ప్‌ వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో తెలిసిందే. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు శ్రీరామ్ సంచలన విషయాలను రివిల్ చేశాడు. తాను మత్తు పదార్థాలను కొనుగోలు చేసినట్లు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. వాటిని అమ్మలేదని క్లారిటీ ఇచ్చాడు. సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీరామ్‌ను మంగళవారం ఎగ్మోర్ కోర్టులో హాజరు పరచగా.. ఆయన మొదటిసారి ఈ విషయంపై మీడియాతో మాట్లాడాడు. నేను ఎలాంటి డ్రగ్స్ అమ్మలేదు.. కానీ తెలిసిన వాళ్ల దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశానని క్లారిటీ ఇచ్చాడు. ఇక సెలబ్రిటీగా ఉండే డ్రగ్స్ తీసుకోవడం తప్పేనని క్షమాపణలు అడిగాడు.

డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్​కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో డ్ర‌గ్స్‌ వివాదం మరోసారి తీవ్ర చర్చకు కారణమైంది. సినీ పరిశ్రమలో ఇంకా కొంతమంది వ్యక్తులు డ్ర‌గ్స్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్న క్రమంలో.. శ్రీరామ్ తాను డ్రగ్స్ తీసుకున్నానని ఒప్పుకోవడం అందరికీ షాక్‌ను కలిగిస్తుంది. అయితే శ్రీరామ్.. తన కొడుకు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. సంరక్షకుడిగా ఆ బాధ్యత నాపై ఉందని పేర్కొంటూ నాకు తక్షణమే బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరుకుంటున్నా అంటూ వివరించాడు. అయితే పోలీసులు శ్రీరామ్‌ను సుమారు 8 గంటల పాటు విచారించినట్లు తెలుస్తుంది. విచారణలో అంశాలు, ఇరుపాక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న ఎగ్మోర్ కోర్ట్.. శ్రీరామ్‌కు జూలై 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Drug abuse bane of Kashmir, likely to pose challenge for new J&K govt

ఇక ఆయన బెయిల్ పిటీష‌న్‌పై నెక్స్ట్ విచారణలో నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. ఇక ఈ దెబ్బతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం, దాని పర్యావసానాలపై మరోసారి దృష్టి సారించారు అధికారులు. ఈ కేసు మరింతగా దర్యాప్తు చేస్తూ కేసు చేదించే పనిలో పడ్డారు. ఇక ఈ కేసులో సినీ ప్రముఖుల డ్రగ్స్ వియోగం.. సమాజంలో మరింత టెన్షన్ పెంచేస్తుంది. యూత్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది.. ఇండస్ట్రీ ప్రతిష్టపై పర్యవసానాలు ఎలా ఉంటాయని అంశాలుచ‌ర్చ‌నీయాంశంగా మారాయి. పోలీసులు ఇలాంటి కేసులో కఠినంగా చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలని జనం డిమాండ్ చేస్తున్నారు.