టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల.. తాజాగా కుబేర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా.. మెసేజ్ ఓరియెంటెడ్గా రూపొందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తాను తీసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమాను కూడా క్వాలిటీతో రూపొందిస్తూ వచ్చాడు. ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా.. తన సినిమాలతో దూసుకుపోతున్న శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం ఉన్న దర్శకుల అందరికంటే వైవిధ్యమైన కాన్సెప్ట్లను ఎంచుకుంటు సినిమాలను తీస్తూ ఉంటాడు. అయితే.. ఇంత మంచి కంటెంట్ తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. ఇప్పటివరకు ఒక ధనుష్తో తప్ప పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేయలేకపోయాడు.
కారణం ఆయన ఎంచుకునే సబ్జెక్ట్ చాలా చిన్న పాయింట్లపై ఉండడమే. వాటిని ప్రేక్షకులు ఆకట్టుకుంటారా.. లేదా స్టార్ హీరోలు నటిస్తే ఆ కంటెంట్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా.. లేదా అనే సందేహమే. చిన్న హీరోలకు అయితే ఆయన తీసుకునే కంటెంట్ బాగా వర్క్ అవుట్ అవుతుందని నమ్మకం. ఈ క్రమంలోనే చిన్న హీరోలనే ఎంచుకుంటూ తన సినిమాలతో సక్సెస్ లో అందుకుంటున్నాడు శేఖర్ కమ్ముల. అయితే.. వాస్తవానికి ఓ స్టార్ హీరోను గతంలో తన స్టోరీ తో ఇంప్రెస్ చేసిన ఆ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదట. అలా శేఖర్ కమ్ముల 3 సినిమాలను ఓ స్టార్ హీరో వదులుకున్నాడు. అతను మరెవరోకాదు మహేష్ బాబు.
గోదావరి మూవీని మొదట మహేష్ బాబు కోసం రాసుకున్నాడట శేఖర్ కమ్ముల. కథను కూడా వినిపించిన తర్వాత మహేష్ ఆ కథ పెద్దగా ఆడియన్స్కు కనెక్ట్ కాదేమో.. తనకు సెట్ కాదేమో.. అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడట. అంతేకాదు.. తర్వాత ఫిదా మూవీ కథ ను మహేష్ బాబుకి వినిపించాడట శేఖర్ కమ్ముల. దానిని కూడా మహేష్ రిజెక్ట్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాలు మహేష్ తన ఇమేజ్కు సరిపోవు అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడంటూ చెప్పకొచ్చాడు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కరోనా టైంలో మహేష్తో సినిమా ప్లాన్ చేయడానికి అంత సిద్ధం చేసుకున్నడట శేఖర్ కమ్ముల. కానీ.. అది కూడా వర్కౌట్ కాలేదు. మొత్తానికి శేఖర్ కమ్ముల మూడు సార్లు చెప్పిన మూడు కథలను మహేష్ బాబు వదులుకున్నాడు.