టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ కు టాలీవుడ్లో ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక.. వీళ్లిద్దరూ అతడు, సైనికుడు సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో అతడు సినిమా సూపర్ హిట్ కాగా.. సైనికుడు ఫ్లాప్ గా నిలిచింది. కాగా.. తాజాగా ఓ ఈవెంట్లో మహేష్ గురించి త్రిష చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి. త్రిష మూట్లాడుతూ.. మహేష్తో పనిచేసే టైంలో చాలా గిల్టుగా ఫీల్ అయ్యాను అంటూ కామెంట్స్ చేసింది.
ఇండస్ట్రీలో అద్భుతమైన నటులుగా నేను ఎంతో అభిమానించే వాళ్ళలో మహేష్ బాబు కూడా ఒకరిని చెప్పుకొచ్చిన త్రిష.. మహేష్ అంత పెద్ద సూపర్ స్టార్ అయిన తోటి నటినట్లను గౌరవిస్తారని.. చాలామందికి అది చేతకాదని.. ఆయన చాలా ప్రొఫెషనల్ అండ్ హార్డ్ వర్క్ చేస్తారంటూ.. ఆమె అభిప్రాయాలను వ్యక్తం చేసింది. తాను నిజంగా సూపర్ స్టార్ అంటూ వివరించిన త్రిష.. నాకేమో షూట్ అయిపోయిన వెంటనే టైడ్ అయిపోతా.. త్వరగా ఇంటికి వెళ్లి పోవాలి అనుకుంటా అంటూ చెప్పకొచ్చింది.
ఇక మహేష్ బాబు వేక్కువ జామున 6:30కి షూట్కు వచ్చినా.. రాత్రి పదిన్నర గంటల వరకు సెట్స్ లోనే ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఆయనతో పని చేసే టైం లో చాలా గిల్టుగా ఫీల్ అయ్యాను అంటూ త్రిష చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మహేష్ వానిటీ వ్యాన్ దగ్గరకు వెళ్లడం నేనెప్పుడు చూడలేదని.. తన సీన్ షూట్ చేసే టైంలో మహేష్ మానిటర్ దగ్గర కూర్చునేవాడంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం త్రిష కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. మహేష్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అది మహేష్ డెడికేషన్ అంటూ.. అయనకు తన ప్రొఫెషన్పై ఉన్న ఇష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు.