జూన్ 1 నుంచి ధియేటర్ల బంధ్ను ఎగ్జిబిటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. చాలా వరకు పెద్ద సినిమాల రిలీజ్ లకు ఆటంకంగా మారుతుందని.. అసలే ఏడాదిలో ఒకటి.. అరా.. భారీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ఇలాంటి సమ్మె భారీ నష్టాలను తెచ్చిపెడుతుందంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు సరైన నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని.. ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ఇండస్ట్రీలో గతకొన్ని రోజులుగా.. దీనిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
అయినా.. నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు తమ డిమాండ్లకు లొంగక పోవడంతో.. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేస్తామంటూ ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చారు. ఇది కాస్త ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. అయితే.. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ నటించిన.. హరిహర వీరమల్లు, ధనుష్.. కుబేర, కమలహాసన్.. థగ్లైఫ్, మంచు విష్ణు.. కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాలు సైతం రిలీజ్ అవుతున్నాయి. దీంతో.. ఈ సినిమాల రిలీజ్ లపై ఎఫెక్ట్ పడనున్న నేపథ్యంలో.. ఇండస్ట్రీ పెద్దలు నష్ట వివరణ చర్చలకు దిగారు.
పర్సంటేజ్ విధానం కోసం పట్టుబట్టి కూర్చున్న ఎగ్జిబిటర్లను.. బుజ్జగించే పని మొదలుపెట్టి ఫైనల్ గా సక్సెస్ సాధించారు. ఈ చర్చలు ఫలించాయి. జూన్ 1 నుంచి ధియేటర్లో బందుకు పిలుపునిచ్చిన ఎగ్జిబిటర్లు.. వెనక్కి తగ్గడంతో.. జూన్ 1 నుంచి యధావిధిగా థియేటర్లో రన్ అవుతాయని.. ఏ ఇబ్బంది లేదని ఫిలిం ఛాంబర్ అఫీషియల్ గా ప్రకటించింది. అఖిలపక్ష సమావేశంలో రాజీ కారణంగా ఎగ్జిబిటర్లు థియేటర్ల బందు నిర్ణయాని వెనక్కి తీసుకున్నారట.