టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్కు ప్రేక్షకుల్లో వేరే లెవెల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్కు సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్.. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న.. క్రేజీ ప్రాజెక్టులలో.. ఫౌజీ మూవీ ఒకటి. ఈ సినిమాలో ఇమన్వీ ఇస్మయిల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రి మూవీ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.
అయితే.. తాజాగా ప్రభాస్ ఓ మేటర్లో హను రాఘవపూడి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అంటూ న్యూస్ వైరల్గా మారుతుంది. సెట్లో కూల్గా ఉంటూ అందరిని నవ్వించే ప్రభాస్.. హను రాఘవపూడిపై ఫైర్ అయ్యాడట. గతంలో ఏ సినిమాకు కష్టపడని స్థాయిలో హను రాగపూడి.. ప్రభాస్ సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఒకింత భారీ స్థాయిలోనే ఈ సినిమా కోసం శ్రమిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ప్రభాస్ రూ.120 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ను ఛార్జ్ చేస్తున్నాడు.
అయితే.. ప్రభాస్ మూవీ 100% పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ కోసం హనురాగపూడి కష్టపడుతున్న నేపథ్యంలో.. ప్రభాస్ ఈ సినిమా కోసం ఇష్టంగా చేయవచ్చు.. కూల్ గా కూడా పని పూర్తి చేయవచ్చు.. ఇంత హైరానా పడవలసిన అవసరం లేదని సూచించాడట. అయితే.. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. హనురాగపూడి కష్టాన్ని చూసి ప్రభాస్ ఆయనకి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చాడంటూ టాక్ మాత్రం తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే డైరెక్టర్గా హనురాగపూడికి తిరుగులేని క్రేజ్ ఏర్పడుతుందనటంలో సందేహం లేదు.