నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతికి ప్రేక్షకులలో పరిచయాలు అవసరం లేదు. ఎన్టీఆర్ ఎంతగానో ఇష్టపడి లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఒకానొక సందర్భంలో ఆమెపై విపరీతమైన కోపంతో చెంపలు పగలగొట్టడట సీనియర్ ఎన్టీఆర్. ఇంతకీ అంత చెత్త పని లక్ష్మీపార్వతి ఏం చేసింది.. ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది.. అనే విషయాలను ఎన్టీఆర్ డ్రైవర్ స్వయంగా వెల్లడించారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఒకరిని ఒకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ళకి అది రెండో వివాహం. కానీ.. ఎన్టీఆర్ అంత పెద్ద వయసులో రెండో పెళ్లి చేసుకోవడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.
అయినా వాటిని పట్టించుకోకుండా తన లైఫ్ తాను చూసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ ఎంతగానో ప్రేమించిన లక్ష్మీపార్వతిని తానే స్వయంగా చితక్కొట్టారట. అది కూడా ఆయన కొడుకు హరికృష్ణ కోసం అని న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. హరికృష్ణ కూతురు పెళ్లి చేస్తున్నానని కచ్చితంగా పెళ్లికి రావాలని స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరి తండ్రిని పిలిచాడట. ఆ టైంలో లక్ష్మీపార్వతి మాత్రం హరికృష్ణ కూతురు పెళ్లికి వెళ్లడానికి వీల్లేదని.. మంకుపట్టు పట్టి అడ్డుగా కూర్చుందట. దీంతో.. చిర్రెత్తుకొచ్చిన ఎన్టీఆర్ చడామడా రెండు చెంపలను వాయించి బయటకు వచ్చేసారట.
అంతేకాదు.. ఎన్టీఆర్ను బయటకు రానీయకుండా ఎన్నో విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిందట. సీనియర్ ఎన్టీఆర్ ని ఆపడానికి లక్ష్మీపార్వతి ఎంత ట్రై చేసినా ఎన్టీఆర్ మాత్రం ఆమె మాటలను అస్సలు పట్టించుకోలేదు. తన మనవరాలు పెళ్ళికి ఎలాగైనా వెళ్లాలని ఫిక్సై ఆమెతో వారించి.. తనను చితకొట్టి మరీ బయటకు వచ్చేసారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా దగ్గరగా ఉండి చూసిన సీనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. హరికృష్ణ కూతురు పెళ్లికి వెళ్లి కొత్త జంటను దీవించి మళ్లీ ఇంటికి వచ్చాడట. ఎన్టీఆర్ అలా ఎంతో ఇష్టపడి చేసుకున్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ నుంచి ఆయన పిల్లలను దూరం చేయాలని చాలా కుట్రలే చేసిందట. కానీ.. ఎన్టీఆర్ మాత్రం తన పిల్లల విషయంలో ఎప్పుడూ లక్ష్మీపార్వతి మాట అసలు పట్టించుకోలేదట.