టాలీవుడ్ సూపర్ స్టార్.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఖలేజా మూవీ తాజాగా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి హీరోయిన్గా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమాకు సింగనమల రమేష్, సి. కళ్యాణ్లు సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. మణిశర్మ సంగీతం అందించగా.. 2010లో భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన సినిమా అప్పట్లో ఆడియన్స్కు పెద్దగా కనెక్ట్ కాలేదు. త్రివిక్రమ్ సినిమాలో మహేష్ ఎప్పుడు చూడని సరికొత్త జోనర్లో కామెడీ హీరోగా చూపించడంతో.. ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే కొద్ది గంటల క్రితం ఈ సినిమా రిలీజై ఓపెన్ బుకింగ్స్ తోనే సంచలనం సృష్టించింది. మొదటి రోజు కేవలం బుకింగ్ కలెక్షన్స్ రూ.8 కోట్లు కొల్లగొట్టి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే థియేటర్లలో మహేష్ బాబు అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలోను పలు సీన్స్ను కూడా రీ క్రియేట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఖలేజా రీ రిలీజ్లో కలెక్షన్ల ఊచపోత మొదలైంది. ఇలాంటి క్రమంలో మరికొందరు మాత్రం ఊహించిన విధంగా వింత చేష్టలు చేస్తూ.. అందరిని షాక్కు గురిచేస్తున్నారు. అలా తాజాగా థియేటర్లో బ్రతికున్న పాములు చేతిలో పట్టుకుని వెళ్లి మరీ ఓ వ్యక్తి ఇతర ప్రేక్షకులను భయ భ్రాంతులను చేసాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్లో పాల్గొన్న సినిమా ప్రొడ్యూసర్ నిర్మాత.. సి.కళ్యాణ్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఖలేజా సినిమాను మొదట్లో ఫ్లాప్ అయ్యేలా చేసింది.. సినిమాను చంపేసింది మహేష్ ఫ్యాన్సే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముందే మహేష్ బాబు రోల్ ఊహించేసుకుని సినిమాకు వచ్చిన తర్వాత.. వాళ్ళకు అసలు ఏం జరిగిందో అర్థం కాక మమ్మల్ని రివర్స్ లో తిట్టారు.
ఆరోజు గుడ్.. నైట్ షో అన్నారు. షో అయ్యాక తాగేసి ఫోన్ చేసి బండ బూతులు మాట్లాడారు. ఒరేయ్ మీకు సినిమాలు తీయడం తెలుసా అని దారుణంగా కామెంట్లు చేశారు. డైరెక్టర్ను కూడా బండబూతులు తిట్టారంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేసి సినిమాలు నాశనం చేసేశారు. ఆరోజు సినిమా ఫ్లాప్ కు కారణమైన అభిమానులే ఈరోజు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఖలేజా బిగ్ స్క్రీన్పై వస్తుంటే చూసి సినిమా బ్లాక్ బస్టర్అని వాళ్లే ఒప్పుకుంటున్నారు. గతంలో సినిమా తీసిన వాళ్ళని తిట్టి తప్పు చేశామని.. 15 సంవత్సరాల తర్వాత ఈ మూవీకి సక్సెస్ ఎలాగైనా కట్టబెట్టాలని ఆరాటపడుతున్నారు. ఖచ్చితంగా సక్సస్ మీట్లో కలుస్తా అంటూ సి. కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అది చూసిన నెటిజన్లు.. రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.